'ముద్దాబంతి పూవు ఇలా పైట వేసెనా.. ముద్దూ ముద్దూ చూపులతో గుండె కోసెనా...' అంటూ యాజిన్ నిజార్ పాడిన 'కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్' చిత్రంలోని పాట ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ చిత్రంలోని పాటను రేడియో మిర్చిలో విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటకు దిబు నినన్ థామస్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
ఈ సినిమా తమిళ మాతృక అయిన 'కణ' చిత్రంలోని 'ఒతాయాడి పాదయిలా...' పాట వరల్డ్వైడ్గా చాలా పెద్ద హిట్ అయ్యింది. యూ ట్యూబ్లో 67 మిలియన్ వ్యూస్ని క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు.
మొదటి పాట విడుదలైన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''ఈ పాట తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది. వరల్డ్వైడ్గా 67 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆ పాటను ఈరోజు విడుదల చేశాం. తెలుగులో కూడా ఈ పాట చాలా మంచి రెస్పాన్స్తో ట్రెండింగ్లోకి వచ్చింది. మ్యూజికల్గా ఈ పాట సినిమాకి పెద్ద హైలైట్ అవుతుంది'' అన్నారు.
కె.ఎస్.రామారావు మాట్లాడుతూ 'తమిళ్లో ఈ సినిమాకు దిబు థామస్ చేసిన మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో కూడా అదే రేంజ్లో హిట్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ను జూలై 2న నిర్వహించబోతున్నాం. క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ అతిథిగా హాజరవుతున్నారు' అన్నారు.