ఈనెల 15న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి పాట విడుదల అవుతుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆ పాట విడుదల కాకుండానే ఒక్కరోజు ముందు అంటే ఈనెల 14న బన్నీ ‘అల వైకుంఠపురములో’ నుంచి కూడ ఒక సర్ప్రైజ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే  ఈ సినిమాకు రెండు పాటలు విడుదల అయిన నేపధ్యంలో  ఇప్పుడు మళ్ళీసర్ప్రైజ్ ఏమిటి అన్న   సందేహాలు ఏర్పడుతున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు బన్నీ త్రివిక్రమ్ ల సినిమాకు సంబంధించి మరో పాట టీజర్ అని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం 14వ తేదీ సాయింత్రం ఈ టీజర్ విడుదల అవుతుంది అనితెలుస్తోంది. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ మొదటి పాట లిరికాల్ వీడియో రిలీజ్ కాకుండానే బన్ని త్రివిక్రమ్ లు ‘సరిలేరు నీకెవ్వరు’ కు వ్యూహాత్మకంగా చెక్ పెట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవాలి. 

ఇది ఇలా ఉండగా ‘అల వైకుంఠపురములో’ సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్ డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డే బన్నీకి బాస్ గా కనిపిస్తుందట. ఒక కార్పోరేట్ కంపెనీలో బన్నీ పూజా హెగ్డేలు పనిచేసే సమయంలో లేడీ బాస్ గా పూజ హెగ్డే బన్నీకి చుక్కలు చూపెడుతుందని సమాచారం. 

ఈ సీన్స్ అన్నీ ఈ సినిమాను చూసే ప్రేక్షకులకు బాగా నవ్వు తెప్పించే విధంగా త్రివిక్రమ్ తన స్టైల్ లో తీసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ఒకరోజు ముందుకు జరిగి జనవరి 11న విడుదల చేయడానికి ఈ మూవీ నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనితో ప్రస్తుతానికి ‘సరిలేరు నీకెవ్వరు’ పై ‘అల వైకుంఠపురములో’ ఆదిపత్యం అన్ని విషయాలలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంక్రాంతి వార్ బన్నీ మహేష్ ల ఇగో వార్ గా మారిన పరిస్థితులలో దీని ప్రభావం బన్నీ మహేష్ ల అభిమానుల పై పడి ఎవరికీ వారు ఈ సినిమా గురించి తమతమ స్థాయిలలో పూర్తి నెగిటివ్ ప్రచారం చేసే ఆస్కారం కనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: