మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తోన్న యాక్షన్ కామెడి 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్కు జంటగా రష్మిక మందన నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు మహేష్ తొలిసారి అవుట్ అండ్ అవుట్ ఎంటెర్టైనింగ్ సబ్జెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బోలెడంత ప్రత్యేకతను ఏర్పడింది. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ లేడీ అమితాబ్ విజయశాంతి. సుమారు 13 ఏళ్ల తరవాత ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
అంతేకాదు ఈ చిత్రంలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక మిలటరీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. మరో విషయం ఏంటంటే.. మహేష్ బాబు.. అన్ని సినిమాలకు దాదాపు చిన్న టైటిల్సే ఉంటాయి. ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మాత్రమే మహేష్ బాబు కెరీర్లో అతిపెద్ద పేరుతో వచ్చిన సినిమా. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ విషయానికొస్తే.. ఈ చిత్రం టైటిల్ ఒకప్పటి ఎన్టీఆర్, హీరోగా నటించిన కంచుకోట సినిమాలో ఉన్న ‘సరిలేరు నీకెవ్వరు’ పాట పల్లవిని ఈ సినిమా టైటిల్గా పెట్టారు. ఒక పాట పల్లవిని మహేష్ బాబు తన సినిమాకు పెట్టుకోవడం ఇదే మొదటిసారి అయింది.
కాగా, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, బండ్ల గణేష్, అజయ్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తుండగా.. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరియు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంపై ఇప్పటికే తారా స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మరి మహేస్ బాగా వీరందరి అంచనాలకు తగ్గట్టు సూపర్ డూపర్ హిట్ కొడతాడో.. లేదో.. చూడాలి.