యువ హీరోలతో తంటానే ఇది. ఏది లేదంటూనే అన్నీ అందరి  కంటికి కనబడేలా చేస్తారు. దాంతో అనుమానాలు రావా మరి. ఓ వైపు ఊరికే, ఉత్తినే స్నేహం అంటూ చెబుతారు. మీడియాలో మసాలా వార్తలు వచ్చినా ఓ పట్టాన  ఖండించరు. దాంతో అనుమానాలు ఓ రేంజిలో పెరిగిపోతాయి. అపుడు తాపీగా అబ్బే మా మధ్య ఏం లేదే అని దీర్ఘాలు తీస్తారు.

 

ఇంతకీ ఈ కధ ఎవరిది అంటే రాజ్ తరుణ్ ది. ఆయన లేటెస్ట్ మూవీ ఒరేద్య్ బుజ్జిగా వచ్చే నెలలో రిలీజ్ అవుతోంది. అందులో ఒక హీరోయిన్ గా హెబ్బా పటేల్ నటిస్తోంది. నిజానికి హెబ్బా పటేల్ తో రాజ్ తరుణ్ చాలా మూవీస్ చేశాడు. పైగా హాట్ మూవీగా ఉన్న కుమారి 21 మూవీ చేశాడు. ఆ తరువాత ఈ జంట స్పీడ్ పెరిగిందట.

 

అలా సరదాగా పబ్బులు, పార్టీలకు కలసి వెళ్ళడంతో రూమర్స్ కూడా ఓ రేంజిలో పెరిగిపోయాయి. అయినా ఏనాడూ ఖండించలేదు ఈ ఇద్దరూ, ఇపుడు ఒరేయ్ బుజ్జిగా మూవీ ప్రమోషన్లో భాగంగా హెబ్బాతో ఏ రకమైనా అఫైర్లు లేవని చెబుతున్నాడు. అలా రాసుకుంటున్నారంతే అంటూ చెబుతున్నాడు.

 

ఆమె నాకు స్నేహితురాలు మాత్రమేనని కూడా చెబుతున్నాడు. మరి ఎంతో మంది హీరోయిన్లతో యాక్ట్ చేసిన రాజ్ తరుణ్ కి ఎవరితోనూ రాని ఈ పుకార్లు కుమారితో రావడం పైన ఏమంటారని అడిగితే సన్నగా నవ్వేస్తున్నాడు. మా మధ్య ఉన్నది మాకు మాత్రమే తెలుసు. మీరు అనుకుంటున్నది కాదు అంటున్నాడు.

 

ఇంకో విషయం చెబుతున్నాడు. తనకు మూడేళ్ళవరకూ పెళ్ళి చేసుకోవాలని లేదని, అపుడు చేసుకుంటానని, తనకు ఏ ఎఫైర్లు  కట్టకండి అని కూడా యువ హీరో వేడుకుంటున్నాడు. ఆయన చెప్పినది నిజమే అనుకున్నా కుమారి సెగలూ, పొగలూ చూసిన వారు, ఆమెతో ఎక్కువగా జోడీ కడుతున్న రాజ్ తరుణ్ చెప్పిన మాటలను పూర్తిగా  నమ్మలేకపోతున్నారుట. అయినా హీరో క్లారిఫై ఇచ్చేశాడుగా, అంతే అనుకోవాలేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: