టాలీవుడ్ లో  భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా నటించిన ‘నీతోడు కావాలి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచమైన ఛార్మి కౌర్.  చిన్న వయసులు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు మొదట తమిళ్ లో నటించినా.. తెలుగు లో మంచి ఛాన్సులు వచ్చాయి.  తెలుగు లో కృష్ణవంశి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘శ్రీఆంజనేయం’ మూవీతో ఛార్మీకి మంచి పేరు వచ్చింది.  ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. 

 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో కలిపి దాదాపు 60కి పైగా చిత్రాల్లో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో తన అందాలతో ఎంతో మంది కుర్రకారును నిద్ర లేకుండా చేసింది.  నటిగానే కాకుండా ఇప్పుడు నిర్మాతగా కూడా ఛార్మీ తన సత్తా చాటుతుంది.  ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకుంది.  ప్రస్తుతం పూరి దర్శకత్వంలో సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ మూవీ నిర్మిస్తుంది. మరోవైపు పూరీ జగన్నాథ్ కొడుకు హీరోగా నటిస్తోన్న ‘రొమాంటిక్’  చిత్ర నిర్మాణ  బాధ్యతలు చూస్తుంది. 

 

తాజాగా ప్రముఖ నిర్మాత జయంత్ తో ఛార్మీ ఓ ఫోటో షేర్ చేసింది.  ఛార్మీతో 16 ఏళ్ల క్రితం ఓ మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా మా ఇద్దరి స్నేహానికి 16 ఏళ్లు పూర్తైయిన సందర్భంగా ఈ పార్టీ ఇచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది ఛార్మి. వీళ్లిద్దరు కలిసి 2004లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘అల్లరి పిడుగు’ సినిమాలో తొలిసారి కలిసి పనిచేసారు. ఇక జయంత్ టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర కథానాయికలందరితో సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: