ఆచార్య లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నాడని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తో పాటు డైరెక్టర్ శివ కొరటాల కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్ ఈ సినిమాలో ఉండడం కష్టమేనని టాక్. చరణ్ ప్రస్తుతం బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ (రణం, రౌద్రం, రుధిరం)లో  నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో ఆచార్య కోసం రాజమౌళి నుండి స్పెషల్ పర్మిషన్ తీసుకొని నెల రోజులు డేట్స్ అడ్జెస్ట్ చేసుకున్నాడు.
 
అయితే కరోనా వల్ల ఇప్పట్లో షూటింగ్  స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు కానీ చరణ్ మాత్రం మే వరకు డేట్స్ ఇచ్చాడు. ఆతరువాత ఆర్ఆర్ఆర్ కోసం సమయం వెచ్చించనున్నాడు. ఇక మే లో షూటింగ్ స్టార్ట్ అయ్యే పరిస్థితి లేకపోవంతో  రామ్ చరణ్ ఈ సినిమాలో నటించడం కష్టమే అనే టాక్ వినిపిస్తుంది. కొరటాల కూడా చరణ్ స్థానం లో మరొకరిని తీసుకోవడానికి రెడీ అవుతున్నాడట. త్వరలోనే దీని గురించి పూర్తి క్లారిటీ రానుంది. 
 
సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చిరంజీవి, నక్సలైట్ గా నటిస్తుండగా చిరు కు జోడిగా కాజల్ కనిపించనుంది. కాగా చిరు తో కాజల్ కు ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరిద్దరూ ఖైదీ నెంబర్ 150లో జోడిగా నటించారు.  ఆచార్య కు మణిశర్మ సంగీతం అందిస్తుండగా నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆగస్టు లో విడుదల చేద్దాం అనుకున్నారు కానీ కరోనా వల్ల ఆ విడుదల వాయిదాపడ్డట్లే.  ఈఏడాది చివర్లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈచిత్రం తరువాత చిరంజీవి, లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు. సాహో ఫేమ్ సుజీత్  ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం పై రామ్ చరణ్ ఈసినిమాను నిర్మించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: