ఇప్పుడు మన తెలుగులో సినిమాల షూటింగ్ కోసం జనాలు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు అనే సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సినిమాల షూటింగ్ అనేది దాదాపుగా సాధ్యం అయ్యే అవకాశాలు అయితే కనపడటం లేదు అనే చెప్పాలి. రోజు రోజు కి కరోనా కేసులు పెరగడం ఇప్పుడు భయపెడుతున్న అంశంగా చెప్పవచ్చు. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు అనే చెప్పాలి. కరోనా కేసులు వందల్లో వేలల్లో నమోదు అవుతున్నాయి. ఇక ఇప్పుడు కరోనా విషయంలో హీరోలు భయపడుతున్నారు. 

 

మహేష్ బాబు సినిమా షూటింగ్ కి ఇప్పుడు రాలేను అని చెప్పాడు అని సమాచారం. తాను స్వేచ్చగా షూటింగ్ చేయలేను అని దయచేసి షూటింగ్ ని వాయిదా వెయ్యాలి అని మహేష్ బాబు చిత్ర యూనిట్ కి విజ్ఞప్తి చేసాడు అని వార్తలు వస్తున్నాయి. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ని మొదలు పెడదామని మహేష్ బాబు సూచించాడు అని దానికి చిత్ర యూనిట్ కూడా దాదాపుగా ఓకే చెప్పింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పరుశురాం కూడా గ్యాప్ లో కథను ఇంకా బాగా తయారు చేయవచ్చు అని భావిస్తున్నాడు. 

 

ఇటీవల కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినిమా ప్రకటన చేసారు గాని సినిమా మాత్రం సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు దాదాపుగా కనపడలేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జక్కన్న స్వయంగా ప్రకటించారు. ఈ సినిమా అమరి ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. మహేష్ కనీసం ఆరు నెలలు తీసుకునే అవకాశం ఉంది గ్యాప్.

మరింత సమాచారం తెలుసుకోండి: