ఒకప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమలో పేరు పొందిన గొప్ప సంగీత దర్శకుల్లో కోటి ఒకరు. గతంలో ఆయన సంగీత సారధ్యంలో వచ్చిన ఎన్నో ఆల్బమ్స్ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడున్న సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, లాంటి మరెందరో హీరోలకు బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చిన బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. అంతెందుకు ఈ రోజుల్లో కూడా జనాలు.. కోటి గారు స్వరపరిచిన ఎన్నో మంచి పాటల్ని ఇప్పటికీ వింటున్నారంటే ఆయన పాటలు ఎంత ఫేమస్ అనేది మనకు అర్ధమవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కోటి అంతగా కనిపించడం లేదు.ఏవో చిన్న చితకా సినిమాలకు సంగీతం చేసుకుంటూ బుల్లి తెరపై రియాల్టీ షోల్లో కనిపిస్తున్నారు.

 ఇటీవల ఆయన మాట్లాడుతూ ఏఆర్ రహమాన్ గతంలో తాము చేసిన మ్యూజిక్ ఆల్బం నుండి ట్యూన్స్ ఇన్సిపిరేషన్ అయ్యి పాటలు చేశాడు. రోజా సినిమాలోని నా చెలి రోజావే పాటను కూడా మా ట్యూన్ ను కాపీ చేశాడంటూ వ్యాఖ్యలు చేశాడు. సినిమా పరిశ్రమపై కూడా కామెంట్స్ చేశాడు. పెద్ద హీరోల సినిమా ఆఫర్లు రాకపోవడంపై కాస్త వెటకారంగా స్పందించాడు. తాను ఇప్పటి వారికి తగ్గట్లుగా అప్ డేట్ అవ్వాలేమో. నాకు రావాల్సిన ఆఫర్లు మరెవ్వరైనా ఆపేస్తున్నారేమో. గతంలో త్రివిక్రమ్ సినిమాకు కూడా సంగీతాన్ని అందించిన తాను ఇప్పుడు వారికి పనికి రావడం లేదు అన్నాడు.త్రివిక్రమ్ సినిమాకు మంచి పాటలు ఇచ్చాను.
 
కాని మళ్లీ అతడు ఎప్పుడు కూడా తన సినిమాకు పాటలు ఇవ్వమని అడగలేదు. ఛాన్స్ ఇవ్వమని నేను కూడా అతడిని అడగలేదు. ఒకసారి మంచి పాటలు ఇచ్చినందుకు మళ్లీ కలిసి పని చేయాలని అతడికే ఉండాలి కదా అంటూ త్రివిక్రమ్ ను విమర్శించినట్లుగా కోటి ఇండైరెక్ట్ కామెంట్స్ చేశాడు.ప్రస్తుతం కోటి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలోనే కాక.. ఇండ్రస్టీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఇక తాజాగా ఈయన ప్రముఖ బుల్లితెర టి.వి.షో జీ తెలుగులో ప్రసారమౌతున్న స రి గ మ ప నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ అనే షో లో జడ్జి గా వ్యవహరిస్తున్నాడు.ఈ షో ప్రస్తుతం ప్రేకకుల్లోమంచి ప్రజాదరణను దక్కించుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: