సినిమా అంటేనే ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ఎక్కడో ఒకరో ఇద్దరో
సినిమా కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ఆ విధంగా
టాలీవుడ్ లో దాదాపు చాలా మంది నటులు
సినిమా కోసం సినిమాలు చేస్తూ
సినిమా పరిశ్రమను బ్రతికిస్తున్నారు. కమర్షియల్
సినిమా అనగానే ఆ సినిమాలో అన్ని హంగులు ఉంటాయి.
హీరోయిన్ దగ్గర్నుంచి
హీరో దాకా ఏమి బయట పెట్టాలో అవన్నీ చేసేస్తూ ఉంటారు. హీరోయిన్లు అందాల ప్రదర్శన చేయడం, హీరోలు సిక్స్ ప్యాక్ వంటి బాడీ లను తయారు చేసుకొని ప్రదర్శించడం వంటివి జరుగుతూ ఉంటాయి.
హీరోయిన్ ల విషయానికి వస్తే వాళ్లు సినిమాల్లో ప్రవేశించాక ఏమాత్రం సంకోచించకుండా తమ అందాల ఆరబోతను ప్రదర్శించాల్సిదే. అలా చేసిన అందరూ స్టార్ లు గా ఎదగగా కొంతమంది మాత్రం తమకు సినిమాలు లేకపోయినా పర్వాలేదు కానీ గ్లామర్ షో లు మాత్రం చేయమని పట్టు పట్టారు. అలాంటి హీరోయిన్లలో ఒకరు కళ్యాణి.
టాలీవుడ్ సినీ పరిశ్రమకు
కళ్యాణి రాజశేఖర్ హీరోగా నటించిన శేషు అనే సినిమాతో పరిచయం కాగా ఆ తర్వాత నటించిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే సినిమాకి గాను ఆమెకు బెస్ట్ నటి నంది అవార్డును అందుకుంది.
అంతకుముందు
తమిళ మలయాళ చిత్ర పరిశ్రమలో
హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె బాలనటిగా సినీ పరిశ్రమలోకి వచ్చి తన సత్తాను చిన్నప్పుడే చాటుకుంది. నంది అవార్డు అందుకున్న తర్వాత ఆమె రేంజ్ తెలుగు లో మారిపోయింది. ఆమె చెప్పిందే వేదం అయిపోయింది మొదటి నుంచి ఎక్స్పోజింగ్ కు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ వచ్చింది. కబడ్డీ కబడ్డీ, దొంగోడు, పెదబాబు, పందెం, ఆపరేషన్ దుర్యోధన, లక్ష్యం, వంటి మంచి మంచి సినిమాల్లో నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన సత్తా చాటుతోంది కళ్యాణి.