టాలీవుడ్
సినిమా పరిశ్రమకి
లీడర్ సినిమాతో పరిచయమై ఆ తర్వాత హీరోగా విలన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు
దగ్గుబాటి రానా.
దగ్గుబాటి వారి వారసుడు మరి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకే సొంతమైన టాలెంట్ తో ఇప్పుడు వరకు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు.
హిందీ తమిళ భాషల్లో సైతం ఆయనకు మంచి
మార్కెట్ ఉంది.
బాహుబలి సినిమా తో ఒక్కసారిగా అన్ని భాషలలో పేరు తెచ్చుకొని సోలో హీరోగా ముందుకు దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం ఆయన విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ
సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించగా ఈ
సినిమా విడుదల ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు
రానా అభిమానులు కానీ గతంలో ఎప్పుడూ లేని అయోమయం ఈ
సినిమా విషయంలో
రానా కు నెలకొందని ఇప్పుడున్న పరిస్థితిని బట్టి తెలుస్తుంది. ఓ వైపు
టాలీవుడ్ హీరోలు తమ సినిమాలను థియేటర్లలో కానీ ఓ టీ టీ లో కానీ విడుదల చేస్తుండగా
రానా మాత్రం విరాటపర్వం
సినిమా ఎప్పుడో పూర్తిచేసిన కూడా ఈ
సినిమా విడుదల పై ఎటువంటి ఆసక్తి చూపించడం లేదు.
ఈ సినిమాను నిర్మించిన
సురేష్ బాబు కూడా ఈ
సినిమా గురించి ఎక్కడా నోరు మెదపడం లేదు. మరి దీని సంగతి ఏంటో అని ఆయన అభిమానులు కలవరపడుతున్నారు. ఆయన గత చిత్రం అరణ్య బాక్సాఫీస్ వద్ద భారీగా ఫ్లాప్ టాప్ తెచ్చుకోవడం తో ఈ సినిమాతో మళ్లీ పుంజుకోవాలని భావిస్తున్న ఈ
సినిమా విడుదల కాకపోవడం తో క్రేజ్ తగ్గి తర్వాత విడుదలైన ఎలాంటి ప్రభావం ఉండదు అని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న విరాటపర్వం సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడుదల చేయాలని అభిమానులు చెబుతున్నారు. మరి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారా లేదా ఓ టీ టీ లలో విడుదల చేస్తారా అనేది చూడాలి.