టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాలలో పవన్ కళ్యాణ్ మరియు రానా హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ రచయితగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ స్వాతంత్ర దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకు రాగా ఆ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

 ఇదే సమయంలో రానా పాత్రకు సంబంధించిన రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఎందుకు రానా ను  ఈ టీజర్లో చూపించలేదు అనే కొత్త చర్చ ముందుకు రాగా ఆ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్ లు రీషూట్ చేస్తున్నారని తాజాగా విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ సినిమా లో వచ్చే ఓ సీక్వెన్స్ లో లాడ్జ్ దగ్గర ఇద్దరు హీరోల మధ్య వచ్చే సీన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సీన్స్ ఇప్పటికే చిత్రీకరించిన కూడా మొన్న వచ్చిన ప్రమోషనల్ వీడియోలో ఆ సీన్స్ లో ఒకటి చూపించారు. అవి అందరికీ సంతృప్తిని ఇవ్వకపోవడంతో మళ్లీ రీ షూట్ చేయాలని భావించారట.

 అంతే కాదు కొన్ని కొన్ని సీన్స్ విషయంలో టీమ్ అందరూ అంతగా ఎంప్రెస్ గా లేరని అందుకే మళ్ళీ ఆ సీన్స్ రీ షూట్ చేస్తున్నారని తెలుస్తుది. ప్రమోషనల్ వీడియోలో పవన్ ఆటిట్యూడ్ చూసిన అభిమానులు ప్రేక్షకులు అదిరిపోయింది అనుకున్నారు. మరి అదే రేంజ్ కు తగ్గట్లుగా సినిమా ఉండకపోతే బాగుండదు అని అంతకు మించి సినిమా ఉండేలా ఆ సీన్స్ ను ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా మళ్లీ రీషూట్ చేస్తున్నారట. మరోవైపు సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ సినిమా ఇలాంటి రీ షూట్ లు పెట్టుకుంటే ఎప్పుడు విడుదల అవుతుందా లేదా అన్న అసహనాన్ని అభిమానులు వ్యక్తపరుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: