క్రేజీ దర్శకుడు పూరీజగన్నాథ్ ప్రస్తుతం హైదరాబాద్ కంటే ముంబాయిలో ఎక్కువ ఉంటూ ఉండటంతో అతడికి టాలీవుడ్ తో ఉన్న కనెక్షన్స్ పూర్తిగా తగ్గిపోతున్నాయి అన్నమాటలు వినిపిస్తున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ అయినప్పటికీ టాప్ హీరోలు ఎవ్వరూ పూరీని పెద్దగా పట్టించుకోకపోవడంతో విజయ్ దేవరకొండతో వరసపెట్టి సినిమాలు చేయవలసిన పరిస్థితి పూరీకి ఏర్పడింది.


‘లైగర్’ మూవీని పాన్ ఇండియా మూవీగా తీస్తూ ఉండటంతో పాటు ఈమూవీ ప్రాజెక్ట్ వెనుక కరణ్ జోహార్ ఉండటంతో పూరీ ముంబాయిని తన నివాసంగా మార్చుకుని అక్కడ ఒక విలాసవంతమైన హోటల్ లో సూట్ తీసుకుని నెలల తరబడి ఉంటూ ఉండటంతో అతడి హోటల్ బిల్స్ కోట్ల రూపాయలలో అయ్యాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు పూరీ విజయ్ దేవరకొండతో తీయబోతున్న ‘జనగణమన’ మూవీని కూడ పాన్ ఇండియా మూవీగా తీస్తూ ఉండటంతో పూరీ హైదరాబాద్ లో ఉండటం కంటే ముంబాయిలో ఎక్కువగా ఉండటానికి ఆశక్తి కనపరుస్తున్నట్లు తెలుస్తోంది.


దీనితో పూరీకి టాలీవుడ్ తో పెద్దగా సంబంధాలు లేవనీ అతడి దృష్టి అంతా బాలీవుడ్ పైనే ఉందని అంటున్నారు. తన కొడుకు ఆకాష్ మూవీ ఫంక్షన్ కు కూడ రాలేనంత బిజీగా పూరీ ఉంటున్నాడా లేకుంటే హైదరాబాద్ పై పూరీకి విరక్తి ఏర్పడిందా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పూరీ ముంబాయిలోని ఒక పోష్ లోకాలిటీలో ఒక విలాసవంతమైన విల్లా తీసుకున్నాడని త్వరలోనే అతడి కేరాఫ్ అడ్రస్ ముంబాయిగా మారిపోతుంది అన్నకామెంట్స్ కొందరు చేస్తున్నారు.


అయితే ఇది అంతా పూరీ విజయ్ ల కాంబినేషన్ లో రాబోతున్న ‘లైగర్’ సక్సస్ పై ఆధారపడి ఉంటుందని ఈమూవీ ఊహించిన స్థాయిలో సక్సస్ కాకుంటే యూటర్న్ తీసుకుని పూరీ భాగ్యనగరంలోని తన డెన్ చేరుకొనే ఆస్కారం ఉంది అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ఎందరో టాలీవుడ్ టాప్ హీరోలకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరీజగన్నాథ్ వైపు మన టాప్ హీరోలు ఎందుకు చూడటం లేదు అని సమాధానం లేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: