సినిమా స్టార్ట్ కావడానికి ముందే ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న మూవీ లలో మహేష్ , రాజమౌళి కాంబో మూవీ ఒకటి . ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చినప్పటి నుండి ఈ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా ..? ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో మంది ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు . ఇక పోతే ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది . ఈ సినిమాకు రాజమౌళి తండ్రి అయినటు వంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించ బోతున్నాడు.

కొన్ని రోజుల క్రితమే విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ లో ఇప్పటికే మహేష్ , రాజమౌళి కాంబో లో రూపొందబోయే సినిమాకు సంబంధించిన కథ మొత్తం పూర్తి అయినట్లు తెలియజేశాడు . ఇక ప్రస్తుతం రాజమౌళి ఆ కథకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే తాజా గా ఈ మూవీ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అ

సలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలను ఏప్రిల్ 9 వ తేదీన నిర్వహించాలి అని అనుకుంటున్నాట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ పూజా కార్యక్రమాలను ఈ మూవీ బృందం చాలా భారీగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమా పూజా కార్యక్రమాల కోసం ఏకంగా 2 కోట్ల బడ్జెట్ ను ఈ మూవీ బృందం కేటాయించినట్లు ఈ బడ్జెట్ తో ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలను భారీ గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: