టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో ఆది పినిశెట్టి హీరోయిన్ నీక్కీ గల్రాని సుపరిచితమే.. తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు ఈ జంట. టాలీవుడ్ లో అయితే కృష్ణాష్టమి అనే చిత్రం ద్వారా తెలుగు తేరకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నిక్కి.. ఆది పినిశెట్టి హీరోగా విలన్ గా పలు చిత్రాలలో నటించి మరింత క్రేజ్ అందుకున్నారు.. ఆది పినిశెట్టి.. నిక్కి గల్రాని ఇద్దరూ కలిసి మలుపు మరకతకమణి వంటి చిత్రాలలో నటించారు.. ఆ సమయంలోను వీరిద్దరు ప్రేమలో పడినట్టుగా తెలుస్తొంది.


అలా కొన్నేళ్లు ప్రేమలో ఉన్న తర్వాత ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి మరి 2022లో వివాహం చేసుకున్నారు.. దీంతో వివాహం తర్వాత నిక్కి పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైపోయింది.. ఆది మాత్రం విలన్ గా హీరోగా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీ గా ఉన్నారు.. తాజాగా నిక్కి తల్లి కాబోతున్నట్లు పలు రకాల వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.. అందుకు కారణం తన ఇంస్టాగ్రామ్ లో నిక్కీ తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సైతం షేర్ చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది.


ముఖ్యంగా నిక్కీ ఫోటోలో ఈమె పొట్ట కాస్త ఎత్తుగా కనిపించడంతో నిక్కి ప్రెగ్నెంట్ తన బేబీ  బంప్ క్లియర్ గా కనిపిస్తోందంటూ పలువురు అభిమానులు నెట్టిజెన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.. అందుకే ఈ ఫోటోలు షేర్ చేసి ఇలా హిట్ ఇచ్చారనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు మరికొందరైతే ఏకంగా వారికి కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం.. నిక్కి ప్రెగ్నెంట్ అనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా  మారుతోంది.. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: