
మొదటి నుంచి ఈ సినిమాని మల్టీ స్టారర్ గానే తెరకెక్కించాలి అంటూ త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారట . మొదటగా రామ్ - వెంకటేష్ లను ఈ స్టోరీలో అనుకున్నరట. కానీ వెంకటేష్ ది లీడ్ పాత్ర కావడంతో వెంకటేష్ హైలెట్ అవుతాడు తన క్యారెక్టర్ తక్కువ అవుతుంది అంటూ రాం ఈ సినిమాను రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఆ రోల్ కోసం నానిని కూడా అప్రోచ్ అయ్యారట. నాని ఇప్పుడు 100 కోట్ల హీరో అందుకే ఈ ప్రాజెక్టు ను రిజెక్ట్ చేసినంట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం త్రివిక్రమ్ తన పూర్తి కాన్సెప్ట్ ని మార్చేసారట.
ఇప్పుడు ఇద్దరి హీరోలతో ఈ సినిమా తెరకెక్కించాలి అని ప్లాన్ చేస్తున్నారట. త్రివిక్రమ్ లీడ్ క్యారెక్టర్ కోసం స్టార్ గా అనుకుంటున్నా హీరో మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తనదైన స్టైల్ లో సినిమాలలో నటించి హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . అఫ్ కోర్స్ ఇప్పుడు పవర్ స్టార్ మాత్రమే కాదు ఏపీ డిప్యూటీ సీఎం కూడా . మరి అలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి సినిమాలో నటిస్తాడా ..? అంటే త్రివిక్రమ్ - పవన్ బాండింగ్ చూసి ప్రతి ఒక్కరు ఆయన నటించిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు .
అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ది లీడా క్యారెక్టర్ గా చేసి హీరో సాయి ధరమ్ తేజ్ ని సెకండ్ హీరోగా చూపించబోతున్నారట. అంటే లెక్క ప్రకారం ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ నే . మొదటినుంచి పవన్ అంటే త్రివిక్రమ్ కి ప్రాణం . మరి అలాంటి వ్యక్తి ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఇంకెంత హైలెట్గా ఆయన రోల్ ని తెరకెక్కిస్తాడు.. జనాలకి చూపిస్తాడు అనేది అందరికీ తెలిసిందే. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే పవన్ తన జాన్ జిగిడి దోస్తు కోసం సినిమాకి కమిట్ అవుతాడా..? లేదా..? అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్ క్ గానే మిగిలిపోయింది..!