
"బాహుబలి" సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేశారు. బాహుబలి చిత్రం విడుదలై దశాబ్దం రోజులు పూర్తిచేసుకుంది. తొలిభాగం 2015జూలై 10న విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది . ఆ తర్వాత 2017 పార్ట్ 2 రిలీజ్ అయ్యి వేరే లెవల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది . బాహుబలి గా ప్రభాస్ భళ్ళాల దేవుడి గా రానా.. దేవసేన గా అనుష్క.. శివగామిగా రమ్యకృష్ణ.. అవంతిక గా తమన్నా .. కట్టప్ప గా సత్యరాజ్ ఈ చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి సినిమాని వేరే లెవెల్ లోకి తీసుకెళ్లారు.
కాగా ఈ సినిమాకి పార్ట్ 3 రావాలి అంటూ ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అలా వస్తేనే ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ మళ్ళీ బాహుబలి 3 బద్దలు కొడుతుంది అంటూ ఆశ పడుతున్నారు . కాగా దీనిపై రీసెంట్గా రాజమౌళి స్పందించారు . "మీ అందరి కోసం మరోసారి బాహుబలి థియేటర్లో సందడి చేయనుంది. బాహుబలి తో రెండు భాగాలుగా కలిపి ఓ సినిమాను రిలీజ్ చేయనున్నాం. అక్టోబర్ 31న ప్రేక్షకులు ముందుకు ఈ సినిమా రాబోతుంది "అంటూ రాజమౌళి ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ ప్రత్యేక మైలురాణి గుర్తు చేసుకుంటాం అంటూ ఈ మెసేజ్ ని అభిమానులు ఫార్వర్డ్ చేస్తున్నారు . ఇది నిజంగా రాజమౌళి అభిమానులకు ఇచ్చిన బిగ్ సర్ప్రైజ్ అంటున్నారు సినీ మేకర్స్. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు రానా అభిమానులు అనుష్క అభిమానులకు ఇది పండుగ చేసుకునే మూమెంట్. కాగా ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కధ అందించారు.