పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఫాలోయింగ్ సాధారణ ప్రజల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలలో కూడా చాలామంది ఉన్నారు . ఆయన సినిమా రిలీజ్ అయింది అంటే వారు స్టార్ హీరో అన్న విషయం కూడా మర్చిపోయి థియేటర్లకి వెళ్లి సందడి చేస్తూ ఉంటారు పలువురు హీరోలు . ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డిప్యూటీ సీఎం హీరోగా నటించినటువంటి ఓజీ సినిమా రిలీజ్ అయింది . సెప్టెంబర్ 25 వ తారీఖున రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ను సంపాదించుకుంది .


ప్రెసెంట్ థియేటర్లని షేర్ చేస్తూ దూసుకుపోతుంది . సుజిత్ డైరెక్షన్ వహించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు . ఇక సుజిత్ యాక్షన్ కి తమన్ రియాక్షన్ ఉండడంతో థియేటర్లు మూత మోకపోతున్నాయి . దీంతో టాలీవుడ్ హీరోలనే కాదు పలువురు ఇతర ఇండస్ట్రీ నటీనటులు కూడా ఈ సినిమాని చూసేందుకు థియేటర్కి విచ్చేస్తున్నారు . ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ ఏమాత్రం రాజీ పడకుండా ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకుని సినిమా చూసేందుకు వస్తున్నారు . ఈ క్రమంలోనే ఓ హీరో చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చాడు . కేవలం ఓజీ సినిమా చూసేందుకే . ఈ విషయం స్వయంగా ఆ హీరోనే తన ట్విటర్ లేదు కదా వెల్లడించాడు .


హీరో మరెవరో కాదు ప్రదీప్ రంగరాజన్ . " నేను ఇప్పుడు హైదరాబాద్ రావడానికి ఒకే ఒక కారణం పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా చూడడానికి మాత్రమే . ఎక్స్ప్రెషన్స్ ని తెలుగు వాళ్లతో చూడడమే కదా మాస్ అంటే " అంటూ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు ప్రదీప్ రంగరాజన్ . ఒక సినిమా కోసం సెలబ్రిటీలు తమ పనులు మానుకుని ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నామంటూ ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు . తమిళ్ హీరో అయినటువంటి ప్రదీప్ రంగరాజన్ కూడా ఈ సినిమా చూసేందుకు ఇంతగా ఇంట్రెస్ట్ చూపించాడు అంటే ఈ మూవీ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు . ప్రెసెంట్ ప్రదీప్ రంగరాజన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: