
అయితే ఇన్నిసార్లు ఆసియా కప్ జరిగినా ఒక్కసారి కూడా పాక్ మనకు టైటిల్ పోరులో ఎదురుకాలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఇక రెండో విషయం ఆసియా కప్లో ఇప్పటివరకూ పాకిస్థాన్తో ఒకే ఎడిషన్లో భారత్ మూడు మ్యాచులు ఆడలేదు. నాలుగు సార్లు మాత్రం రెండేసి సార్లు ఆడాయి. ఇప్పుడు ఈ ఎడిషన్లో మాత్రం ముచ్చటగా మూడోసారి ఆడుతున్నాయి. ఇక గ్రూప్ మ్యాచ్లో పాక్ను ఓడించిన భారత్ .. సూపర్ స్టేజ్ మ్యాచ్లోనూ మరోసారి ఓడించింది. ఇక ఇప్పుడు ఫైనల్స్లో మరోసారి ఆడుతోంది.
భారత్ - పాక్ ఫైనల్కు ఎలా వచ్చాయంటే...
గ్రూప్ స్టేజ్లో భారత్, పాకిస్థాన్తో పాటు యూఏఈ, ఒమన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. భారత్ మూడు మ్యాచ్లు గెలిచింది. పాక్ ఒమన్, యూఏఈపై గెలిచి సూపర్ 4కు వచ్చింది. సూపర్ 4లో మరోసారి భారత్.. పాక్పై గెలిచింది. పాక్ మాత్రం బంగ్లా, శ్రీలంకను ఓడిచించింది. భారత్ మూడు మ్యాచ్లు గెలిచింది. ఇప్పుడు ఫైనల్స్లో ఏం జరుగుతుందా ? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.