తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చారు...కానీ అతి కొద్ది మంది మాత్రమే సక్సెని చవిచూశారు. కొంత మంది హీరోయిన్లుగా నిలబడటానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు..కానీ కొంత మంది హీరోయిన్లకు మాత్రం ఒకటీ..రెండు సినిమాలలో విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. అలాంటి వారిలో కీర్తి సురేష్ ఒకరైతే మరోక హీరోయిన్ ‘ఫిదా’ ఫేమ్ సాయి పల్లవి. మళియాళంలో ప్రేమమ్ తో మంచి పేరు తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగు లో శేఖర్ కమ్ములు దర్శకత్వంలో ‘ఫిదా’ సినిమాతో తెలంగాణ యాస మాట్లాడుతూ అందరి మనసు దోచింది.
తాజాగా ఈ అమ్మడు నాని హీరోగా నటిస్తున్న ‘ఎంసీఏ’ చిత్రంతో మరోసారి అభిమానుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం నాలుగేళ్ల పాపకి తల్లిగా యువ కథానాయిక సాయిపల్లవి నటించిన చిత్రం 'కణం'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం.. తమిళంలో 'కరు' పేరుతో విడుదల కానుంది. నాగ శౌర్య కథానాయకుడు. విజయ్ దర్శకత్వం వహించారు.
వాస్తవానికి ఈ సినిమా దీపావళికి విడుదల కావాల్సిన ఈ సినిమా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా, ఈ సినిమాని ఫిబ్రవరి 9న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత ప్రకటించారు. అయితే 2018 ఫిబ్రవరి 9 నాడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇక ఒకే రోజున మూడు సినిమాల రిలీజ్కు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేసుకోగా తాజాగా అదేరోజు నేను కూడా బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నట్టు తెలిపింది ఫిదా పోరి సాయి పల్లవి.
విభిన్నమైన కథతో లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్.. సస్పెన్స్తో నిండిన సన్నివేశాలతో అందర్నీ ఆకట్టుకుంటుంది. నేచురల్ బ్యూటీగా కెరియర్లో దూసుకుపోతున్న సాయి పల్లవి ఈ చిత్రంలో నాలుగేళ్ల పాపకు తల్లిగా నటిస్తుండటం విశేషం