వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దూకుడును ఎలాగైనా తగ్గించాలని బాబుగోరు తన బుర్రకి బాగానే పని చెబుతున్నాడు. రోజురోజుకి బాబు యాక్టివ్ గా మారుతున్నాడు, జగన్ ప్రభుత్వం పై ఇప్పటికే పదునైన ఆరోపణలతో విరుచుకుపడుతున్నాడు. అసలుకే అపారమైన అనుభవమైన ఉన్న బాబు నుండి ప్లాన్ వచ్చిందంటే.. ఖచ్చితంగా అది జగన్ ప్రభుత్వానికి అపాయకరమైనదే అయి ఉంటుంది. జగన్ కి కూడా ఈ విషయం తెలుసు. అందుకే బాబు చేస్తోన్న ఆరోపణల పై తన నాయకుల చేత వివరణ ఇప్పించి బాబును విమర్శించే కార్యక్రమాలను షురూ చేశాడు. ప్రస్తుతం జగన్, బాబు అమరావతి భూముల విషయంలో అవినీతి చేసారని.. ఆ అవినీతిని నిరూపించే ప్రణాళికాల్నే అమలు పరుస్తునట్లు తెలుస్తోంది. అయితే కొందరి టీడీపీకి సంబంధించిన ప్రభుత్వ అధికారులు నుండి మాత్రం జగన్ ప్రభుత్వంలో హామీల బడ్జెక్ట్ విషయంలో అలజడి మొదలయిందని లీకులు ఇస్తున్నారు. ఇక ఇప్పటికే జగన్ దూకుడు కి అడ్డుకట్టవేసి, జగన్ సర్కార్ పాలన పూర్తిగా విఫలం అయిందని.. నింద మోపి జనంలో తాను క్రెడిట్ కొట్టేయాలని బాబుగోరు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తన మీడియా చేత ఇప్పటికే రాతలు రాపిస్తున్నారు.