సిద్ధిపేట దుబ్బాక ఘటనలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏరకమైన సెర్చ్ వారెంట్ లేకుండా  ఇంట్లో వస్తువులను చిందర వందర చేశారు అని ఆయన విమర్శించారు. మహిళ ల పట్ల, పిల్లల పట్ల  అసభ్యంగా ప్రవర్తించారు అని విమర్శలు చేసారు. స్వయానా మా అభ్యర్థి రఘునందన్ భార్య తో దురుసుగా ప్రవర్తించారు అని అన్నారు. మా అభ్యర్థి రఘునందన్ పై, మా అధ్యక్షుడు బండి సంజయ్ పై, ఎన్నికల ఇంచార్జ్ జితేందర్ రెడ్డి పై పోలీసులు వ్యవహరించిన తీరు పూర్తి అప్రజాస్వామికం అని ఆయన విమర్శలు చేసారు.

ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం అన్నారు. అధికారం శాశ్వతం కాదని ఆయన స్పష్టం చేసారు. ఇందిరా గాంధీ, ఎన్టీఆర్, చెన్నారెడ్డి, చంద్రబాబు లాంటి నేతలను ప్రజలు చూశారు అని ఆయన పేర్కొన్నారు. అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదు అన్నారు. కేసీఆర్ కుటుంబమే  శాశ్వతంగా పరిపాలిస్తారనుకోవడం వారి భ్రమనే అని ఆయన స్పష్టం చేసారు. కాంగ్రెస్, టిడిపి హయాంలలో ఎన్నో ఉప ఎన్నికలు చూసాం... కానీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పూర్తిగా  ఆరాచకంగా జరుగుతోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి  అనుకూలంగా వ్యవహరిస్తున్న  సిద్దిపేట జిల్లా కలెక్టర్ ను ఈపాటికే ఎన్నికల కమిషన్  బదిలీ చేసింది అని ఆయన చెప్పారు. బండి సంజయ పై పోలీసుల తీరును  తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. దుబ్బాక లో బీజేపీ గెలుస్తుందనే  సంకేతాలతోనే  అధికార టీఆరెస్ పార్టీ ఈ అరాచకాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపణలు చేసారు.  బీజేపీ కార్యకర్తలు సంయమనం కోల్పోకూడదు అని ఆయన సూచించారు. టీఆరెస్ ప్రభుత్వ వైఫల్యాలను  ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అన్నారు. టీఆరెస్   వ్యహాల్లో బీజేపీ కార్యకర్తలు చిక్కకూడదు అని... పార్టీ ప్రచారం పైనే పూర్తి దృష్టి నిలపాలని విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: