ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...నారా లోకేష్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పలు వివాద స్పద వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం జగన్‌ మాట్లాడిన మాటలకు లోకేష్ తనదైన శైలిలో తన స్పందన తెలియ చేయడం జరిగింది. ఈ క్రమంలో బుధవారం సీఎం జగన్‌కు సోషల్ మీడియాలో స్పందిస్తూ నారా లోకేష్ వ్యాఖ్యలు చెయ్యడం జరిగింది. తెలుగు దేశం పార్టీ నేత  చంద్రబాబునాయుడు సోమవారం అసెంబ్లీలో స్పీకర్ పోడియం ముందు భైఠాయించి నిరసన తెలిపారు. అధికార పక్ష సభ్యుల తీరుపై నిరసన వ్యక్తం చేయడం జరిగినట్లు మనం చూసాం...


ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి చర్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎప్పుడూ అలా ప్రవర్తించలేదని దుయ్యబట్టారు. మీడియాలో ఫొటోలు వేయించుకునేందుకే ఇలా చేశారని చంద్రబాబును విమర్శించారు. దీంతో సీఎం జగన్‌ వ్యాఖ్యలకు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఈ విధంగా సోషల్ మీడియాలో స్పందించాడు..


‘‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి గజినీలా నటించినా గూగుల్ మర్చిపోదుగా, ఇలా కొడితే అలా వచ్చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభలో చిందులు వేసి, అధికారం రాగానే నీతులు చెబితే ఎలా? జగన్ రెడ్డిది నోరు కాదు అబద్ధాల పుట్ట.’’ అని లోకేష్ తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోడియం ముందు నిరసన చేయాలంటూ పురమాయించారని ఆ వీడియోలో ఉంది.


ముఖ్యంగా ఆ వీడియోలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఎక్కువగా టార్గెట్ చేశారు. ఆ సభలో మంత్రి పీతల సుజాతను విమర్శిస్తూ ఎమ్మెల్యే రోజా ప్రదర్శించిన హావభావాలు అప్పట్లో సంచలనం రేపాయి. ఆ విజువల్స్‌నే లోకేష్ తన వీడియోలో హైలెట్ చేయడం జరిగింది... ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: