నిజానికి కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లును చాలా పార్టీ లు నిరాకరించాయి.అయినా కొన్ని పార్టీ లను బెదిరించి మరీ మోడీ దానికి ఆమోద ముద్ర వేయించుకున్నారు..తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ప్రభుత్వం ఆ బిల్లుకు సపోర్ట్ చేయగా తెలంగాణా ప్రభుత్వం మాత్రం వ్యతిరేకంగా నిలిచింది.. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా జగన్ ఈ బిల్లుకు సానుకూలంగా ఉన్నారని తెలుస్తునిడ్.. అయితే పార్టీ లను, నాయకులను అయితే బెదిరించగలరు కానీ రైతులను బెదిరించలేరు కదా అందుకే అన్నదాతలు తమకు జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం వినిపించేలా ఢిల్లీ లో నిరసన గళాలను వినిపిస్తున్నారు.
చర్చల పేరుతో చేసిన నామమాత్రపు ప్రయత్నాలు ఫలించకపోవడంతో రైతుల ఆందోళనపై తప్పుడు ప్రచారానికి తెరతీసింది బీజేపీ. అయినా... అడుగు వెనక్కి తగ్గేది లేదంటూ ఢిల్లీ సరిహద్దుల్లోనే భీష్మించుకు కూర్చున్నారు రైతులు. హర్యానా ఢిల్లీలను కలిపే ఐదు రహదారులను దిగ్భంధం చేశారు.పాలక విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన దేశ రైతాంగం చారిత్రాత్మక పోరాటాన్ని నమోదు చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం మాత్రమే కాదు. రైతుల పొట్టలుగొట్టి కోట్లకు కోట్లు పోగుజేసుకుంటున్న కార్పోరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం. ఒక్కమాటలో చెప్పాలంటే అంబానీ, అదానీల అగ్రో బిజినెస్ కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం. ఇది అక్షరాలా నిజం.