ఆ తర్వాత అదే సాకు చూపి కేసీఆర్ పొంగులేటికి 2019 లోక్ సభ ఎన్నికల లో టిక్కెట్ ఇవ్వలేదు సరికదా ? అప్పటి వరకు టీడీపీలో ఉన్న నామా నాగేశ్వర రావును పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ సీటు ఇచ్చారు. దీంతో నామా భారీ మెజార్టీ తో ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఇక ఆ తర్వాత పొంగులేటి కి రాజ్యసభ వస్తుందన్న ప్రచారం జరిగినా కేసీఆర్ మాత్రం ఎప్పటి కప్పుడు పక్కన పెడుతూ వస్తున్నారు. దీంతో రగిలి పోతోన్న ఆయన ఇప్పుడు షర్మిల పార్టీ లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ముందు కొద్ది రోజులు పాటు షర్మిల పార్టీకి తెర వెనక వ్యూహాలు పన్నుతూ.. కాస్త పార్టీకి మూమెంట్ వచ్చిన వెంటనే ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సన్నిహితులతో ఏర్పాట్లు చేయిస్తున్నాడు అని గుస గుసలు వినిపిస్తున్నాయి.