
గణతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాళహస్తి కి చెందిన ఆర్టిస్ట్ సుధీర్ రూపొందించిన కలంకారీ కళ స్క్రోల్ పై ఉంటుంది. కలంకారీ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు పెన్నుతో కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్ పై చేసే చేతి పెయింటింగ్ యొక్క పురాతన శైలి. కలంకారీ అనే పదం ఒక పర్షియన్ పదం నుండి ఉద్భవించింది, ఇక్కడ ' కలం ' అంటే కలం 'కరి' కళాత్మకతను సూచిస్తుంది.ఈ కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్టార్చింగ్, క్లీనింగ్ ఇంకా మరెన్నో 23 శ్రమతో కూడిన దశలు ఉంటాయి. కలంకారీలో గీసిన మోటిఫ్ లు పువ్వులు, నెమలి ,పైస్లీల మొదలు మహాభారతం ,రామాయణం వంటి హిందూ ఇతిహాసాల దైవిక పాత్రల వరకు విస్తరించి ఉంటాయి.ఈ రోజుల్లో, ఈ కళ ప్రధానంగా కలంకారీ చీరల తయారీకి ఉపయోగిస్తున్నారు.
శ్రీ సుధీర్ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్న సంప్రదాయ కలంకారీ కళాకారుడు. హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయం నుంచి పెయింటింగ్ లో బ్యాచిలర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ (బివిఎ) పూర్తి చేశాడు,