అలాంటిది తాజాగా బోరిస్ జాన్సన్ కు పోలాండ్ పర్యటనలో ఉక్రెయిన్ మహిళా జర్నలిస్ట్ చేతిలో చుక్కెదురైంది. పోలాండ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరు అయిన జాన్సన్ ను మహిళా జర్నలిస్ట్ తన ప్రశ్నలతో చుక్కలు చూపించింది. ఈమె మాట్లాడుతూ, ఈ రోజు ఉక్రెయిన్ ఈ పరిస్థితిలో ఉంది అంటే కారణం మీరు కాదా అంటూ ప్రశ్నించింది. యుద్ధం మొదలై వారం రోజుల పైగా అవుతున్నా ఇప్పటికి ఏదైనా చేసి యుద్ధం ఆపకుండా, ఎంతసేపటికీ ఆర్థిక ఆంక్షలు అంటూ కహానీలు చెబుతున్నారంటూ జాన్సన్ పై ఫైర్ అయింది. అమాయక ప్రజలపై బాంబుల వర్షం కురుస్తోంది దీనికి కారణం మీరు కాదా అంటూ గట్టిగా అడిగింది.
రష్యా ప్రజలు మాత్రం సురక్షితంగా ఉన్నారు.. మరియు రష్యా బిలియనీర్ల పిల్లలు కూడా వేరే దేశాల్లో విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. వాళ్ళ పిల్లలు మాత్రం యుద్ధంతో సంబంధం లేకుండా ఉన్నారు, కానీ మా పిల్లలు అందరూ నెత్తుటి ముద్దల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు అంటూ తన ఆవేదనను అతనిపై వెళ్లగక్కింది. ఇంతటి పరిస్థితుల్లో మీరు పోలాండ్ పర్యటనకు వచ్చారే కానీ, కీవ్ కు ఎందుకు రాలేదు అంటూ నేరుగా ప్రశ్నించింది. ఇలా ఆమె ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే ఏమి సమాధానం చెప్పాలో బోరిస్ జాన్సన్ కు అర్థం కాక నీళ్ళు నమిలాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి