ఎన్నికల హడావుడి మొదలవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి.. అందులోను పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పకుంటే ఇక్కడ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి..టీడీపీ కి కంచు కోట అయిన ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా మళ్ళీ తిరిగి సాదించుకోవాలని టీడీపీ బలమైన వ్యూహ రచన చేసింది. గతంలో రెండు సార్లు పోటీ చేసి గెలిచిన సీనియర్ నాయకుడిని కాదని ఓ కొత్త అభ్యర్థిని బరిలో నిలిపింది. ఇక అతడు ఢీ కొట్టబోయే అభ్యర్థి ఎవరో కాదు స్వయానా తన మామ కావడం విశేషం..పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ బరిలో నిలిచారు.  భాష్యం ప్రవీణ్ పేరు మొదట గుంటూరు పశ్చిమంలో వినిపించింది. ఆ తరువాత చిలకలూరిపేట లో కూడా వినిపించింది. ఎట్టకేలకు పెదకూరపాడులో సీటు దక్కింది.. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కొమ్మాలపాటి శ్రీధర్ మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు ఎంతగానో ప్రయత్నించారు.

2009,2014 ఎన్నికల్లో గెలిచిన శ్రీధర్ 2019 వైసీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల్లో శ్రీధర్ కు అనుకూల వాతావరణం లేదనే సర్వే తేలడంతో కొత్త అభ్యర్థి కి టిక్కెట్టు ఇచ్చినట్లు టీడీపీ పేర్కొనింది. దీనితో కొమ్మాలపాటీ శ్రీధర్ క్యాడర్ కాస్త నిరుత్సాహానికి గురిఅయినట్లు తెలుస్తుంది. అధినేత చంద్రబాబు హామీ ఇవ్వటంతో  అధిష్టానం నిర్ణయమే తనకి శిరోధార్యం అని శ్రీధర్ ప్రకటించారు..భాష్యం ప్రవీణ్ కి సహకరించి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ఆయన సిద్ధం అయ్యారు. దీనితో ఇరువురు నాయకులు కలవటంతో వైసీపీ లో కాస్త తడబాటు మొదలైందని కొందరు అంటున్నారు.. అయితే  వైసీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు అన్న కుమార్తెను భాష్యం ప్రవీణ్ వివాహం చేసుకున్నారు. దీనితో మామా అల్లుళ్ళ పోరు ఎలా ఉంటుందో అని అంతా చర్చించుకుంటున్నారు.నంబూరు శంకరరావును ఢీ కొట్టాలంటే భాష్యం ప్రవీణ్ కే సాధ్యం అని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: