
ఈ నోటీసులో భట్టి విక్రమార్క మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. ఒకవేళ భట్టి క్షమాపణ చెప్పకపోతే, రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అంతేకాక, క్రిమినల్ కేసులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయవాది విజయ కాంత్ నోటీసులో స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు తన వ్యక్తిగత, రాజకీయ ఇమేజ్కు తీవ్ర నష్టం కలిగించాయని రామచందర్ పేర్కొన్నారు.రోహిత్ వేముల ఆత్మహత్య కేసు గతంలోనూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో 2024లో ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టు ఇచ్చిన నివేదిక రామచందర్ రావుతో పాటు ఇతరులను ఆరోపణల నుంచి నిర్దోషులుగా పేర్కొంది.
అయినప్పటికీ, భట్టి ఈ ఘటనను రాజకీయంగా వాడుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నోటీసు రాజకీయ ఉద్దేశంతో కాకుండా, తన గౌరవాన్ని కాపాడుకోవడానికేనని రామచందర్ రావు స్పష్టం చేశారు.ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది. భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పకపోతే, ఈ లీగల్ పోరు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ వివాదం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు