దీపావళి పండుగ చాలా దగ్గరలో ఉంది. ఈ దీపాల పండుగలో ప్రజలు దీపాలను వెలిగిస్తారు. దీపం వెలుగుతో అందరి ఇళ్లు ప్రకాశవంతంగా ఉండడడమే కాకుండా ప్రజల మొహాల్లో ఆ వెలుగులు విరజిమ్ముతాయి. అయితే దానికన్నా ముందు అలాగే దంతెరాస్ ను జరుపుకుంటారు. దంతెరాస్ అంటే త్రయోదశి తిథి. అక్టోబర్‌లో ఒకదాని తర్వాత ఒకటి జరిగే పవిత్రమైన హిందూ పండుగల శ్రేణిలో అత్యంత ముఖ్యమైనది ఈ త్రయోదశి తిథి. ఎందుకంటే భారతదేశంలోని అతిపెద్ద పండుగ దీపావళితో పాటు దీనిని జరుపుకుంటారు. హిందూ చాంద్రమాన మాసం కార్తీక మాసంలో కృష్ణ పక్షంలోని పదమూడవ రోజు త్రయోదశి తిథి (దంతెరాస్)ను జరుపుకుంటారు. ఈ రోజున సముద్ర మథనం సమయంలో పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ప్రత్యక్షమైందని నమ్ముతారు. అందుకే త్రయోదశి తిథి నాడు కుబేరునితో పాటు లక్ష్మీదేవిని ఉత్సాహంగా, భక్తితో పూజిస్తారు. ఈ సంవత్సరం దీనిని మంగళవారం, నవంబర్ 2, 2021 నాడు జరుపుకుంటారు. పూజా సమయం 18:22 నుండి 20:09 వరకు ఉంటుంది. ప్రదోష కాలము 17:37 నుండి 20:09 వరకు ప్రారంభమవుతుంది.

ఈ పండుగను చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి, ప్రజలు ఈ రోజున బంగారు ఆభరణాలు, బట్టలు వంటి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఆరోజూ చేయాల్సిన, చేయకూడని పనులను తెలుసుకోండి.  

ఏం చేయాలి?
ఈ రోజు పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి.
చెత్తను ప్రతికూల శక్తికి కేంద్రంగా భావిస్తారు. కాబట్టి దానిని పారవేయండి.
ప్రదోష కాలంలో లక్ష్మీపూజ చేయాలి.
కుటుంబంలో ఎలాంటి అకాల మరణాలు జరగకుండా ఉండాలంటే ఇంటి బయట దీపం వెలిగించాలి.
పంచాంగంలో పేర్కొన్న శుభ ముహూర్తంలో మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేయండి.

ఏమి చేయకూడదు?
మట్టి లేదా వెండి విగ్రహాలను పవిత్రంగా భావిస్తారు.  కాబట్టి గాజు లేదా ఇతర విగ్రహాలను పూజించవద్దు.
ఇది లక్ష్మీ దేవిని స్వాగతించే పండుగ, కాబట్టి ఇంటి ప్రవేశద్వారం వద్ద బూట్లు, చెప్పులు ఉంచవద్దు.
ఈ రోజున అప్పు చేయకూడదని నమ్ముతారు.
ఇంట్లో ప్రతికూల ఆలోచనలు వ్యాపించకుండా పూజా కార్యక్రమాలు సంతోషంగా చేయాలి.
ఈ రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: