ప్రస్తుతం ఆటో మొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా చాలా ఎక్కువగా నడుస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై చాలా మంది వినియోగదారులు కూడా ఆసక్తి కనబరుస్తుండడంతో టాప్ కంపెనీలు కూడా తమ కొత్త ఈవీ వాహనాలను మార్కెట్ లో విడుదల చేస్తున్నాయి.ఇంకా అలాగే ఇండియాలో ఉన్న పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా ఈవీ వెహికల్స్ వైపు వినియోగదారులు ఎంతగానో మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండియా ఓ ఎలక్ట్రిక్ కార్ రిలీజ్ చేసిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ త్వరలో మరికొన్ని కొత్త మోడల్స్ విడుదల చేస్తామని తెలిపింది.తమ కొత్త తరం ఎస్ యూవీల ను ఇండియాలో ప్రదర్శిస్తామని ఇటీవల తెలిపింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక కంపెనీ వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 10 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించే మహీంద్రా ఈవీ ఫ్యాషన్ ఫెస్టివల్ లో కంపెనీ కొత్త ఈవీ మోడల్స్ ను ప్రదర్శిస్తుంది. ఫ్యూచర్ ఇప్పుడే ప్రారంభవుతుంది.


 'ఇక మా కొత్త ఎస్ యూవీల గ్రాండ్ హోమ్ కమింగ్ కోసం వేచి ఉండండి' అంటూ మహీంద్రా కంపెనీ ఇటీవల సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. ఎలక్ట్రిక్ ఎస్ యూవీలను తయారు చేసే రెండు బ్రాండ్స్ లో కొత్త బోర్న్ ఎలక్ట్రిక్, మరో ఎక్స్ యూవీ కార్ ఇండియాలో ప్రదర్శిస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కార్లు గత సంవత్సరం ఆగస్టులో యూకే లోని ఆక్స్ ఫర్డ్ షైర్ లో ప్రదర్శించడం జరిగింది.ఇక యూకే లో మహీంద్రా ఐదు ఎలక్ట్రిక్ ఎస్ యూవీలను వెల్లడించింది. ఎక్స్ యూవీ ఈ8, ఎక్స్ యూవీ ఈ9, బీఈ 05, బీఈ07 ఇంకా అలాగే బీఈ08 లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్స్ యూవీ ఈ8, ఈ9, బీఈ 05 ఇంకా అలాగే 07 కార్లు 2024 వ సంవత్సరం నుంచి 2026 వ సంవత్సరం మధ్య ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ మోడ్సల్ అన్ని కూడా ఇంగ్లో ఈవీ ఫ్లాట్ ఫామ్స్ పై ఆధారపడి పని చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: