
దీంతో వేల్స్పన్ లివింగ్, ట్రైడెంట్, ఇండోకౌంట్ వంటి దిగ్గజ ఎగుమతి సంస్థలే కాదు, చిన్న ఎగుమతిదారులు కూడా పెద్ద షాక్లో పడ్డారు. ఆగస్టు 27 నుంచి మొత్తం 50 శాతం టారిఫ్లు అమలులోకి రానున్నాయి. దీని వల్ల అమెరికాలో భారత్ తయారు చేసిన వస్త్రాల ధరలు 30 నుంచి 35 శాతం పెరగనున్నాయి. ఇదే విషయాన్ని రిటైల్ సంస్థలు చెబుతున్నాయి – “ఈ ఖర్చును మీరు (ఇండియా ఎగుమతిదారులే) భరించాలి” అని! దాంతో ఇప్పటికే కొన్ని ఒప్పందాలు క్యాన్సిల్ అయ్యాయి. ఇక ఈ పరిణామాలు మామూలుగా ఉన్నా, దాదాపు రూ.4-5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో భారత్ టెక్స్టైల్ రంగం నుంచి 36.61 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరగగా, 28 శాతం అమెరికా మార్కెట్ నుంచే వచ్చాయి. అంటే చెప్పడానికే కాదు.. ఆర్థికంగా నిజంగానే అమెరికా పై ఆధారపడిన రంగం ఇది. కానీ తాజా పరిణామాలతో అమెరికా కంపెనీలు బంగ్లాదేశ్, వియత్నాం వంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ట్రంప్ ప్రకటించిన ఈ కొత్త టారిఫ్ విధానాలు వాడి స్టైల్ అనిపించుకోవచ్చు, కానీ భారత్ ఎగుమతి రంగానికి మాత్రం భయంకరమైన బురద తవ్వినట్టే అయ్యింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ బలమైన షాక్ నుంచి ఎలా బయటపడుతుంది? ట్రేడ్ డిప్లొమసీలో ఎలాంటి మెరుపులు చూపిస్తుంది? అన్నదే ఆసక్తికరంగా మారింది.