వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఇంకా ఆ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో డబ్బు రాజకీయం నడుస్తోందని జరుగుతుందని సోము వీర్రాజు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్క స్థానానికి సుమారు 100 కోట్లు ఖర్చు చేయడానికి వైసీపీ చూస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. గ్రామ సభను వాజ్ పేయ్ తీసుకువస్తే ఒక నాయకుడు దానిని జన్మభూమి కింద మార్పు చేసి ఏడాదికి నాలుగుసార్లు పెట్టారని సోము వీర్రాజు గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఖాళీ స్థలం ఉంటే పన్ను కట్టాలని లేకపోతే  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోందని సోము వీర్రాజు  ఎద్దేవా చేశారు. ప్రజలను భయ పెట్టాలని అధికారులు ఖాళీ స్థలాల వద్ద బ్యానర్లు కడుతున్నారని సోము వీర్రాజు  ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు బీజేపీలోకి చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని సోము వీర్రాజు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: