ఇండియాలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశియ రిటైల్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది.ఇంకా అలాగే దీనితో పాటు బ్యాంక్ ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను కూడా పెంచింది.అయితే ఇక ఈసారి ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీపై వడ్డీ రేటును కూడా పెంచింది. బ్యాంకు 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు ఎఫ్‌డీల రేట్లను 7.25 శాతానికి పెంచడం జరిగింది. మొత్తం రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ రేట్లన్నీ కూడా సవరించింది.ఇక ఈ వారం ప్రారంభంలో ఎస్‌బీఐ ఎంపిక చేసిన కాలపరిమితిపై మొత్తం 65 బేసిస్ పాయింట్ల దాకా ఎఫ్‌డీ రేట్లను పెంచింది. ఇవి డిసెంబర్ 13 వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్‌లకు గరిష్ట వడ్డీ రేటు 7.25 శాతం ఉంది. ఇది 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల దాకా 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల దాకా , 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల దాకా ఉన్న కాల వ్యవధికి అందుబాటులో ఉంటుంది.ఇక సాధారణ కస్టమర్ల కోసం ఎఫ్‌డీ రేట్ల తాజా సవరణ తర్వాత ఎస్‌బీఐ 7 రోజుల నుండి 45 రోజుల దాకా 3 శాతం వడ్డీని అందిస్తోంది.


అలాగే పెట్టుబడిదారులు 46 రోజుల నుండి 179 రోజుల మధ్య ఎఫ్‌డీపై 3.9 శాతం, ఇంకా 180 రోజుల నుండి 210 రోజుల కంటే తక్కువ పథకాలకు మొత్తం 5.25 శాతం పొందుతారు. ఇంకా అదే సమయంలో 211 రోజుల నుండి 1 సంవత్సరం దాకా ఉన్న పథకాలకు బ్యాంక్ వడ్డీ రేటు 5.75 శాతం ఉంటుంది.ఇక 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల దాకా ఉన్న పథకాలకు బ్యాంక్ 6.75 శాతం ఆఫర్ చేస్తోంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల దాకా 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.అలాగే 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల దాకా  5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల దాకా ఈ పథకాలకు 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.ఇంకా ఈ సంవత్సరం మే నుండి bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ ఫలితాలకు అనుగుణంగా చాలా బ్యాంకులు కూడా తమ ఎఫ్‌డీ రేట్లను దూకుడుగా మార్చాయని, ఇక ఈ పెట్టుబడి ఎంపికను అనుసరించడానికి ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షించింది. మే నెల నుంచి ఆర్‌బీఐ తన రెపో రేటును ఐదుసార్లు పెంచడం జరిగింది. ఇక మార్చి 4.40 శాతం నుంచి 6.25 శాతానికి పెంచడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: