ఇక మన దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన వినియోగదారులకు అప్డేటెడ్ టెక్నాలజీతో కూడిన ఎన్నో సదుపాయాలను అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది.ఎస్బీఐ ఆన్ లైన్ ఇంకా యోనో యాప్ లలో వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలును అందిస్తోంది. అలాగే టోల్ ఫ్రీ నంబర్, ఎస్ఎంఎస్ ల వంటి వాటి ద్వారా కూడా అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు అందిస్తుండగా.. ఇప్పుడు మినీ స్టేట్‌మెంట్‌ను కూడా మిస్డ్ కాల్ తో వస్తోంది.ఖాతాదారులకు ముఖ్యంగా అకౌంట్ బ్యాలెన్స్ ఇంకా అలాగే మినీ స్టేట్ మెంట్ అనేవి ఎక్కువగా అవసరం అవుతాయి. వీటిని తక్షణం పొందేందుకు ఎస్బీఐ చాలా రకాల మార్గాలను ప్రవేశపెట్టడం జరిగింది. కస్టమర్లు ఎస్బీఐ క్విక్ బ్యాంకింగ్, మిస్డ్ కాల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, మొబైల్ ఇంకా అలాగే నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ మార్గాల ద్వారా మినీ-స్టేట్‌మెంట్‌ను పొందవచ్చు. అయితే స్టమర్‌లు తప్పనిసరిగా వారి ఫోన్ నంబర్‌ను ఖాతాకు లింక్ చేసుకొని ఉంటేనే ఈ సదుపాయం అనేది సాధ్యమవుతుంది.


మినీ స్టేట్‌మెంట్‌లో NEFT, RTGS,  UPI వంటి వివిధ మోడ్‌ల ద్వారా నిర్వహించబడే అన్ని లావాదేవీల వివరాలు కూడా ఉంటాయి.ఎస్బీఐ టోల్-ఫ్రీ నంబర్ 9223766666 ద్వారా కస్టమర్లు వారి ఫోన్లోనే ఎస్ఎంఎస్ లేదా కాల్ చేయడం ద్వారా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు.ఇక మినీ స్టేట్ మెంట్ గత 5 లావాదేవీల గురించి వివరాలు తెలుసుకోవడానికి sbi మినీ స్టేట్‌మెంట్ నంబర్ 09223866666కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇక రెండు రింగ్‌ల తర్వాత కాల్ డిస్‌కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత వినియోగదారుని ఫోన్ కి మినీ స్టేట్‌మెంట్‌తో ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. ఆ ఖాతాపై ఇటీవల చేసిన ఐదు లావాదేవీలు అందులో మీకు కనిపిస్తాయి.ఎస్ఎంఎస్, లేదా మొబైల్ సర్వీస్ లను పొందేందుకు ఎస్బీఐ ఖాతాదారులు తమ ఖాతాకు ఫోన్ నంబర్ ను లింక్ చేసుకోవాలి.ఇక ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 09223488888కి ‘REG Account Number'అని SMS చెయ్యాలి.తరువాత మీకు ఇది విజయవంతం అయినట్లు  మెసేజ్ వస్తుంది.ఇక అప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు అర్ధం.

మరింత సమాచారం తెలుసుకోండి: