మాట మార్చం.. మడమ తిప్పం.. ఇది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాట.. ఆ మాటలు తూ.చా. తప్పకుండా పాటిస్తున్నారు ఆయన తనయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.  నేటికి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అయ్యింది.  ఒక నాయకుడు ప్రజల మనసు గెలవాలంటే ఎంత గొప్ప త్యాగానికైనా సిద్దం కావాలి.  అదే జగన్ మోహన్ రెడ్డిని ఈ స్థాయికి తీసుకు వచ్చింది.. కోట్ల ఆస్తి ఉన్నా.. అన్ని ఆనందాలు తన ముందు ఉన్నా.. ప్రజల కోసం తండ్రి బాటలో నడిచారు. 

 

అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రజలకు గ్రాఫిక్స్ మాయాజాలంతో అభూత కల్పన సృష్టిస్తుంటే.. నిజం ఏంటో ప్రజలకు కన్నులకు కట్టినట్టు చూపించాలని.. వారిని చైతన్య పర్చాలని ‘ప్రజా సంకల్ప యాత్ర’ మొదలు పెట్టి పల్లె పల్లె తిరిగి ప్రతి మనిషితో మాట్లాడా వారి కష్ట సుఖాలను తెలుసకొని పాలన అంటే గ్రాఫిక్ కాదు.. వాస్తవికత ఎంటో సీఎం అయ్యాక చూపించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రజా సంకల్ప యాత్రలో తానేం చెప్పాడో అవి తూ.చ. తప్పకుండా పాటిస్తూ ప్రజల మన్నలు పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: