సినీ పరిశ్రమను కరోనా వెంటాడుతూనే ఉంది. తాజాగా మరో సినీ ప్రముఖుడికి కరోనా సోకింది. ప్రముఖ సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకూ.. తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందని నటుడు, రచయిత పోసాని పోసాని కృష్ణమురళి తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలు తనను క్షమించాలని..ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.


తనకు కరోనా రావడం వల్ల రెండు సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయని పోసాని కృష్ణమురళి తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలో షూటింగ్ లో పాల్గొంటానని  పోసాని కృష్ణమురళి తెలిపారు. ఆయన త్వరలోనే కోలుకోవాలని.. చురుగ్గా షూటింగుల్లో పాల్గోవాలని  సినీ పరిశ్రమ కోరుకుంటోంది. ఓవైపు కరోనా నుంచి కోలుకుని సినిమా థియేటర్లు తెరుచుకుంటున్నాయి.  మళ్లీ సినీ పరిశ్రమలో సందడి నెలకొంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: