ఆగస్టు 15 నాడు ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రాల్లో సీఎంలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించటం ఏటా చూస్తున్న విషయమే. కానీ.. పంద్రాగస్టు నాడు పీఎం జెండా ఎగరేయడం 1947 నుంచి ఉన్నా.. సీఎంలకు మాత్రం ఆ అవకాశం మొదటి నుంచి లేదు.. అప్పట్లో.. స్వాతంత్ర్య దినోత్సవం రోజు కేవలం ప్రధాని మాత్రమే జెండా ఎగరేసేవారు.

మరి సీఎంలకు ఆ అవకాశం ఎప్పటి నుంచి దక్కింది.. ఎలా దక్కింది అంటారా.. ఈ అవకాశం తమిళనాడు  సీఎం కరుణానిధి కారణంగా వచ్చింది. 1973 వరకూ దిల్లీలో ప్రధాని, రాష్ట్రాల్లో గవర్నర్లు మాత్రమే త్రివర్ణ పతాకం ఎగరేసేవారు. 1969లో అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి ఈ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాలపై వివక్ష తగదంటూ కేంద్రానికి ఘాటుగా లేఖ రాశారు. రాష్ట్రాల్లో సీఎంకు పతాకావిష్కరణ అవకాశం ఇవ్వాలన్నారు. ఆ తర్వాత ఈ డిమాండ్‌ను  ప్రధాని ఇందిరాగాంధీ అంగీకరించింది. 1974 ఆగస్టు 15 నుంచి... సీఎంలు కూడా త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించటం ప్రారంభించారు. జనవరి 26న గవర్నర్లు జెండా ఎగురవేసే విధానం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: