అనుమానం అనేది పెను భూతం లాంటిది.. ఒక్కసారి ఎవరిమీదైనా కలిగితే వాళ్ళో, లేక ఇవతలి వాళ్ళో చనిపోతే తప్ప,లేకుంటే అలానే పెరుగుతుంది. భార్యాభర్తల మధ్యన ఇలాంటి అనుమానాలు లెక్క లెనన్ని వస్తాయి.. పోతాయి.. వాటిని వెంటనే పరిష్కరించుకొవాలి. లేదంటే ప్రాణాలే పోతాయి. ఇప్పుడు అలాంటి ఘటన ఎదురైంది.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మాటా మాటా చెప్పుకుంటూ మందేశారు. చాలా కబుర్లు చెప్పుకున్నారు. 



అలాంటి ఆనంద సమయం లో వచ్చిన ఒక్క ఫోన్ కాల్ వారి సంతోషాన్ని  నాశనం చేసింది. భార్య ను ఫోన్ గురించి గుచ్చి గుచ్చి అడిగి.. భార్య పై విచక్షణా రహితంగా కత్తి తో పొడిఛాడు.. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లొకి వెళితే.. మీరట్‌లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న వికాస్ అలియాస్ విక్కీకి, ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతానికి చెందిన నేహాకు గతేడాది వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్లకు భార్యపై వికాస్ అనుమానం పెంచుకున్నాడు.. ఆ విషయాన్ని భార్యకు తెలియకుండా మ్యానెజ్ చేసాడు.



ఇకపోతే..భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతుందని భావించిన వికాస్ మద్యానికి అలవాటుపడ్డాడు. అప్పుడప్పుడు భార్య నేహాతో కలిసి కూడా తాగేవాడు. ఆమె కూడా భర్తతో కలిసి మద్యం సేవించేది. అంతలా ఎవరు కాల్స్ చేస్తున్నారని నేహాను కొన్ని సందర్భాల్లో వికాస్ నిలదీశాడు.. అప్పటి నుంచి అతనికి దూరంగా ఉంటుంది.ఇటీవల వికాస్, నేహా కలిసి ఇంట్లో మద్యం సేవించారు. అప్పుడే నేహా కు వచ్చిన ఫోన్ కాల్ కోపాన్ని తెప్పించింది. ఆపుకోలేని కోపంతో ఉన్న వికాస్ పక్కనే ఉన్న కూరగాయల కత్తితో దాడి చేసాడు.పై నుంచి పెద్దపెద్దగా కేకలు వినిపించడంతో అప్పుడే బయటకు వెళ్లి వచ్చిన వికాస్ తల్లి పైకెళ్లి చూసేసరికి నేహా రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో.. వికాస్‌ను వారించిన అతని తల్లి కోడలిని ఆసుపత్రికి తరలించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ద్రువీకరించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: