ఈ మధ్య కాలం లో దొంగలు బెడద  ఎక్కడ చూసినా పెరిగిపోతూనే ఉంది. దీంతో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలి అంటేనే భయపడిపోతున్నారు ఇంటి యజమానులు. ఎందుకంటే ఏదైనా పని ఉండి ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా బయటకు వెళితే చాలు ఇక తిరిగి వచ్చేసరికి ఇంట్లో విలువైన వస్తువులు ఉంటాయా ఉండవా  అన్న భయం అందరిలో పెరిగిపోయింది. ఎందుకంటే అంతలా దొంగలు రెచ్చిపోయి ఇళ్లను గుల్ల చేస్తూ ఉన్నారు. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించాయి అంటే చాలు  ఏదో ఒక విధంగా ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకు పోతూ ఉంటారు. అంతేకాదు ఇటీవల కాలంలో కేవలం ఇళ్లలో దొంగతనాల చేయడమే కాదు ఒక అటు వాహనాలు దొంగతనాలు చేయడం లాంటివి కూడా చేస్తున్నారు.


అయితే ఇలా దొంగతనాలు చేయడానికి వినూత్నమైన దారులు వెతుకుతున్నారు దొంగలు. పోలీసులకు చిక్కకుండాఎలాంటి ఆనవాళ్లు దొరకకుండాఎలా దొంగతనం చేయాలి అని ముందుగానే ప్లాన్ వేసుకుంటూ ఇక పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అయితే ఇప్పటివరకు విలువైన వస్తువులను నగదును వాహనాలను దొంగలించడం లాంటివి ఎన్నో సార్లు విన్నాము.. చూశాం కూడా. కానీ ఇక్కడ దొంగలు మాత్రం కాస్త డిఫరెంట్. వీరికి నగదు నగలు విలువైన వస్తువులు లాంటివి అస్సలు అవసరం లేదు.. వీళ్ళ టార్గెట్ ఒక్కటే . అదే ఇక పెద్ద పెద్ద ఇళ్ళల్లో పెంచుకునే కుక్క పిల్లలు.


 ఇటీవలి కాలంలో కుక్కలు పెంచుకోవడానికి ఎంతో మంది ఇష్టపడుతున్నారు. అంతే కాదు ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది.. ఇక ఇప్పుడు దొంగలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇక ఇటీవల కాలంలో అనంతపురంలో దొంగల బెడద ఎక్కువైపోయింది. ఖరీదైన కుక్కలను టార్గెట్ చేసుకొని ప్లాన్ ప్రకారం కుక్కలను దొంగలిస్తున్నారు. ఇక గత రెండు రోజుల నుంచి నగరంలోని పలు ఇళ్లలో విలువైన కుక్కలు అపహరణకు గురవుతు ఉండటం గమనార్హం. ఇటీవలే లెక్చరర్స్ కాలనీ లో నివాసముంటున్న సుదర్శన్ నాయుడు ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని దుండగుడు కుక్కను అపహరించాడు. దీంతో సుదర్శన్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: