బంగారం కొనాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్.. గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం ధరలో ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగుతోంది. అయితే వెండి రేటు మాత్రం పడిపోయింది.పసిడి ప్రేమికులకు ఊరట కలిగిందని చెప్పాలి.కానీ వెండి రేటు మాత్రం తగ్గుతూ రావడం జరుగుతోంది. నాలుగు రోజుల నుండి కూడా వెండి రేట్లు తగ్గుతున్నాయి. అంతేకాదు పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. విదేశీ మార్కెట్ లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.

ఇకపోతే హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు ఎలా వున్నాయి అనేది చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.49,750 వద్దనే ఉంది. ఏ మార్పు లేదు. అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.45,600 వద్ద నిలకడగా వుంది. వెండి ధర రూ.700 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.75,700కు పడిపోయింది.వెండిని ఎక్కువగా పరిశ్రమ రంగంలో వినియోగిస్తారు. అలాగే ఆభరణాల తయారీ కోసం కూడా వాడతారు. అందువల్ల వెండికి డిమాండ్ ఎప్పటికీ ఉంటుందని గమనించాలి. వెండి ధరలపై గ్లోబల్ మార్కెట్ రేట్లు, డాలర్, అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులు ఇలా పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు.


ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర 0.55 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1884 డాలర్లకు చేరింది. వెండి రేటు మాత్రం క్షీణించింది. ఔన్స్‌కు 0.33 శాతం తగ్గుదలతో 27.62 డాలర్లకు దిగొచ్చింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి కారణాల వలన బంగారం పై ప్రభావం పడుతుంది.మరి రేపు బంగారం ధరలు ఏ విధంగా మార్కెట్ లో నమోదు అవుతాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: