జనవరి 26వ తేదీన బుట్ట బొమ్మ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగ వంశీ మీడియాతో వెల్లడించారు. బుట్ట బొమ్మ జనవరి 26న థియేటర్లలోకి రానుంది.. మేం చేసినట్లే మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాము అంటూ ఎస్ నాగ వంశీ వెల్లడించారు. ఇకపోతే ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న అనీఖా సురేంద్రన్.. సత్య అనే ఒక పల్లెటూరి అమ్మాయిగా నటించింది. ఈ చిత్రంలో అర్జున్ దాస్ అవుట్ అండ్ అవుట్ సీరియస్ రోల్లో కనిపించనున్నాడు సూర్య వశిష్ట కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇకపోతే గత ఏడాది డిసెంబర్లో విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే అందులో మూడు పాత్రలు ఆసక్తిని రేకెత్తించే నిష్పత్తిలోనే కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమాను సాంఘిక నాటకంగా రూపొందుతున్న నేపథ్యంలో దర్శకుడు శౌరీ చంద్రశేఖర్ టి రమేష్  దర్శకత్వం వహించారు. గణేష్ రావూరి సంభాషణలు రాయగా , గోపీసుందర్ , వంశీ పచ్చి పులుసు దీనికి సంగీత దర్శకుడిగా సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.


ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి తాజాగా ఒక పాటను విడుదల చేయగా పాట మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. "పేరులోని ఊరులోకి కొత్త గాలొచ్చిందా" అనే సరదా ఉల్లాసమైన పాటను ఆవిష్కరించారు. మోహన భోగరాజు పాడిన ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇప్పటికే ఈమె సింగర్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిం.ది ఈమె చేత ఈ సినిమాలో పాట పాడించి మరింత పాపులారిటీని తీసుకొచ్చారు. "వినోదంలో కథేముందో" అంటూ సాగే లిరికల్ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే మొన్నటి వరకు విశ్వాసంతో పాటు తదితర చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనేక ఇప్పుడు ఒకసారిగా హీరోయిన్ గా మారబోతుందని తెలిసి పలువురు ఈమె నటనపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: