
ఇప్పటికే మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ రీ రిలీజ్ హవా.. ఆ తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్, బాలకృష్ణ లాంటి తదితరుల సినిమాలు రీ రిలీజ్ చేసి మంచి సక్సెస్ పొందారు. ముఖ్యంగా రీ రిలీజ్లకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు బిజినెస్ కూడా జరుగుతోంది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినీ కెరియర్ లో సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో సింగమలై అంటూ వచ్చే డైలాగ్ ఆ సమయంలో అభిమానులకు పూనకాలు తెప్పించేది. ఇప్పుడు మరోసారి విడుదల అవుతుండడంతో ఈ సినిమాపై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సింహాద్రి సినిమాలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా 2003 జూలై 9న విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా అదిరిపోయే కలెక్షన్స్ కూడా తీసుకొచ్చింది. ఇందులో అంకిత, భూమిక హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ 4కే వెర్షన్లో థియేటర్లలో రావడానికి సిద్ధమవుతోంది.