ఈ మద్య కొంత మంది అభిమానుల అత్యుత్సాహం వల్ల సెలబ్రెటీలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫ్లెక్సీలకు సంబంధించి ఈ వివాదాలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. స్టార్ హీరోల అభిమానులు కొన్ని సార్లు ఫ్లెక్సీల వివాదాలతోనే రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ వివాదాలు రాజకీయ నేతల్లో కూడా ఉంటున్నాయి. తాజాగా ఓ ఫ్లెక్సీ వివాదంపై జబర్ధస్త్ యాంకర్ రష్మీ సీరియస్ అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. జబర్ధస్త్ లో అనసూయ తర్వాత యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మీ బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా తన సత్తా చాటుతుంది.
జబర్ధస్త్ లో సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. వీరు చేస్తున్న స్కిట్ అందరినీ అలరిస్తుంది. అయితే జబర్థస్త్ లో సుడిగాలి, రష్మీకి మద్య రిలేషన్ కొనసాగుతుందని ఆ మద్య తెగ వార్తలు వచ్చాయి. ఓ టెలివిజన్ ఛానల్ లో పెళ్లి కార్యక్రమంపై రక రకాలు రూమర్లు వచ్చాయి. అయితే తమ మద్య ఎలాంటి రిలేషన్ లేదని కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటున్నారు వీరు. కాగా, క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, తిరుపతిలో ఈ నెల 9న 10 కె రన్ ను నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ .. రష్మీ పాల్గొననున్నట్టు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై రష్మీ స్పందించింది. "ఈ ఈవెంట్ కి సంబంధించిన నిర్వాహకులు ఎవరూ ఇంతవరకూ నన్ను సంప్రదించలేదు. ఈ ఈవెంట్ కి నేను రానున్నట్టుగా జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. అంతే కాదు ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని..నా అనుమతి లేకుండా నా ఫోటోని ఎలా ఉపయోగిస్తారు? నిర్వాహకులు వెంటనే నా ఫ్లెక్సీని తొలగించాలంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది.