తెలుగు ఇంటి ఆడపిల్లలా  ముద్దుగా బొద్దుగా ఉండే హీరోయిన్ ఆదా శర్మ . అయితే టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించినప్పటికీ ఈ భామకు లక్కు  మాత్రం అంతగా కలిసి రాలేదు. అవకాశాలు  కూడా చాలా తక్కువ ఉంది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలు చేసిన ఈ బ్యూటీ ... గ్లామర్ పాత్రలతో వర్కౌట్ అవ్వకపోవడంతో భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు  సాగుతుంది . ఈ క్రమంలోనే మెన్  టూ మెన్  చిత్రంలో హిజ్రా పాత్రలో నటిస్తుంది ఆద శర్మ. అయితే ఈ సినిమా షూటింగ్ లో ప్రస్తుతం ఈ అమ్మడు బిజీ బిజీ గా  ఉంది. అయితే ప్రస్తుతం ఆద శర్మ  ఒక ప్రకటన చేసింది. ఏదో సరదాకి చేసిందో... నిజంగానే పెళ్లి చేసుకోవాలని  చేసిందో తెలియదు కానీ ఈ ప్రకటన మాత్రం నెటిజన్లను ఆకర్షిస్తుంది. 

 

 

  ఇంతకీ ఆదాశర్మ చేసిన ప్రకటన ఏంటో తెలుసా వరుడు కావాలి అంటూ  ప్రకటన చేసింది. దీంతో  నిజంగానే ఆద శర్మ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందా ... లేదా  ఏదైనా సినిమాలో ప్రమోషన్స్ లో భాగంగా ఇలా ప్రకటన చేసిందా  అనేది మాత్రం నెటిజన్లను కన్ఫ్యూజ్ చేస్తుంది . అయితే ఓన్లీ  ప్రకటన మాత్రమే కాదండోయ్ తనకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న  పెళ్ళికొడుకు కావాలో  కూడా తెలిపింది ఆదా శర్మ . అతను ఉల్లిపాయలు తినకూడదని, కులం మతం రంగు, షూ సైజు,  వీసా,  స్విమ్మింగ్,  కండలు, ఇలాంటివేవీ తనకు పట్టింపు లేదని... రోజుకు మూడు పూటలా నవ్వుతూ వండి పెడితే చాలు  అని చెప్పింది. అంతేకాదు రోజూ షేవింగ్ చేసుకోవాలని ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులు ధరించాలని తెలిపింది. అతనికి రోజు ఐదు లీటర్ల మంచి నీరు అందిస్తా  కానీ మద్యం మాంసాహారం లాంటివి ఇంట  బయట నిషేధం అని తెలిపింది . అన్ని భారతీయ చిత్రాల పై అతనికి గౌరవం ఉండాలని  వాటిని చూసి ఎంజాయ్ చేసే వారై ఉండాలని తనకు కాబోయే వరుడికి కావాల్సిన క్వాలిటీస్ తెలిపింది అందాల ముద్దుగుమ్మ ఆద శర్మ. ఈ భామ ఇలాంటి పోస్ట్లు పెట్టడం తో నెటిజన్లు అందరూ కన్ఫ్యూషన్ లో పడ్డారు. నిజంగానే ఆదా శర్మ  పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నేనంటే నేను  రెడీ అంటూ ఆదాశర్మ ట్విట్ పై  కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: