అప్పుడే 2020 వచ్చేస్తోంది. మరి కొద్ది రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాం. 2010 నుంచి ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి మిశ్రమ ఫలితాలనే అందించింది. అయితే ఎప్పుడూ కొరత ఉండే హీరోయిన్ల కష్టాలు మాత్రం కాస్త 2019లో తీరాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దశాబ్ద కాలంలో ఎంతో మంది ముద్దుగుమ్మలు తెలుగులో మెరిశారు.
2019లో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన హీరోయిన్స్ మంచి విజయం అందుకున్నారు. తమ భవిష్యత్తుకు మంచి పునాది వేసుకున్నారు. తమ అందాలతో 2019ని కలర్ ఫుల్ గా ముగించేశారు. తొలి చిత్రాలతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ బ్యూటీస్ తమ అందం, అభినయంతో అలరించారు.
ప్రియాంక అరుళ్ మోహన్. ఆమె ఇండియ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఆణిముత్యం. ఇప్పటికే శాండిల్ వుడ్ లో ఓద్ కతే హెల్లా అనే సినిమాలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. తెలుగులో నాని సరసన గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది.
ఇక శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ. ఈమె ముఖ్యంగా కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మెప్పిస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ 1990 సెప్టెంబర్ 29న జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ పట్టణంలో జన్మించింది. తెలుగులో నాని సరసన జెర్నీ తో టాలీవుడ్ కి పరిచయం అయి తన హావభావాలతో ప్రేక్షకులను మెప్పించింది.
దివ్యన్షా కౌశిక్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ. మంచి మోడల్ కూడా. నాగ చైతన్య మూవీ మజిలీ ద్వారా దివాన్షా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
సలోనీ మిశ్రా కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మంచి నటి. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 2019 లో ఫలక్ నుమా దాస్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
హర్షిత గౌర్ కూడా మంచి నటీమణి. ఈ ఏడాది ఫలక్ నుమా దాస్ సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇక 2018లో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మల్లో కైరా అద్వాని ఒకరు. బాలీవుడ్ లో వచ్చిన ధోనీ సినిమాతో పరిచయం అయిన ఈ భామ.. టాలీవుడ్ లో భరత్ అనే నేనుతో అడుగుపెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తొలి అడుగు వేయడంతో ప్రేక్షకులకు నోటెడ్ అయిపోయింది. రామ్ చరణ్ వినయ విధేయ రామలో కూడా మెప్పించింది.
2018లో తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరో బ్ముూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ... ఫస్ట్ మూవీతోనే స్టార్ అయిపోయింది. తర్వాతి మూవీ గీతగోవిందం సంచలన విజయం సాధించింది. దీంతో టాప్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోయింది రష్మిక మందన్న. దేవదాస్ ఫ్లాప్ అయినా కూడా విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ లో మెప్పించింది. సమ్మోహనం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. వరుణ్ తేజ్ అంతరిక్షంలో నటించింది.
తెలుగమ్మాయిలు ఎందుకు రారు.. ఇక్కడ అందమైన అమ్మాయిలు లేరా అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన మరో బ్యూటీ ప్రియాంక జవాల్కర్. టాక్సీవాలా సినిమాతో ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. అనంతపురం నుంచి వచ్చిన ప్రియాంక అచ్చమైన తెలుగులో మాట్లాడుతుంది.
పాయల్ రాజ్ పుత్.. ఆర్ఎక్స్ 100 సినిమాలో ముద్దుల వర్షం కురిపించి కుర్రాళ్ల మతిపోగొట్టింది. ఈ సినిమాతో దెబ్బకు స్టార్ అయింది పాయల్. సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బెంగళూర్ బ్యూటీ నిధి అగర్వాల్. నాగచైతన్యతో రొమాన్స్ చేసినా కూడా తొలి చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. మిస్టర్ మజ్ను పర్వాలేదనిపించింది.
అచ్చమైన తెలుగమ్మాయి శోభితా ధూళిపాల.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అడవిశేష్ హీరోగా వచ్చిన గూఢచారిలో యాక్ట్ చేసింది. అందులో అందాలతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది. వీళ్లతో పాటు తెలుగు ఇండస్ట్రీకి మరికొందరు ముద్దుగుమ్మలు కూడా వచ్చారు. సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటేలో నభా నటాష్ హీరోయిన్ గా నటించింది. ఇక చిలసౌలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది రుహానీ శర్మ. నాని హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్దంలో రుక్సర్ మీర్ సెకండ్ హీరోయిన్ గా పరిచయం అయింది. వీళ్లతో పాటు నర్తనశాలలో నాగశౌర్యతో కాష్మీరా పర్దేశీ హీరోయిన్ గా పరిచయం అయింది.
సీనియర్ హీరోయిన్ల రికార్డ్ ఎలా ఉన్న కొత్త భామలు హవా చూపించారు. సురభి, పూర్ణ, రెజీనా, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి, హేబ్బా పటేల్ ఇలా అందరూ ఆకట్టుకున్నారు. అందం అభినయం కలిపి ప్రేక్షకులకు గాలం వేశారు. కలెక్షన్ల వేటలో తమ రోల్ పర్ఫెక్ట్ గా ప్లే చేశారు. మెహ్రీన్ – కృష్ణగాడి వీర ప్రేమగాథ, నీహారిక – ఒక మనసు, రాధికా ఆప్టే – కబాలి, నివేదా థామస్ – జెంటిల్ మేన్, రాశిఖన్నా – హైపర్, సుప్రీమ్, రష్మి – గుంటూర్ టాకీస్, రెజీనా కాసెండ్రా – జ్యో అచ్యుతానంద, శౌర్య.. రీతూ వర్మ – పెళ్లిచూపులు , సురభి – ఎక్స్ ప్రెస్ రాజా, జెంటిల్ మేన్ .. అమీ జాక్సన్ – పోలీస్ , కాథరీన్ ట్రెసా –కథకళి సినిమాలు చేశారు. వీరంతా చేసిన సిసిమాలు చాలావరకు హిట్టయ్యాయి. మరి ఏదేమైనా 2016లో కుర్ర భామల హవానే బాగా నడిచింది.
2015 సంవత్సరంలో అద్బుతమైన చిత్రాలు తెలుగు తెరకు పరిచయం కాగా ఇందులో కొందరు సీనియర్ హీరోయిన్లతో పాటు కుర్ర భామలు తమ హవా చాటుకున్నారు. యోగా బ్యూటీ అనుష్క శెట్టి గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఇటు డీ గ్లామర్ రోల్లోనూ, అటు వీరత్వం ఉన్న రాణి పాత్రలోను నటించి ప్రేక్షకులచే జేజేలు అందుకుంది. ఇక ఈ అమ్మడు సైజ్ జీరో చిత్రం కోసం ఏకంగా 20 కేజీలు పెరిగి తనకు నటనపై ఎంతటి మక్కువ ఉందో మరో సారి ప్రేక్షకులకు పరిచయం చేసింది. బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు ఈ ముద్దుగుమ్మ రేంజ్ను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో నిలిపేలా చేశాయి.
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా బాహుబలి సినిమాలో డ్యూయల్ షేడ్స్లో కనిపించి మెప్పించింది. కాజల్ అగర్వాల్ టెంపర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. సమంత సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. కమల్ గారాల పట్టీ శృతి హాసన్ శ్రీమంతుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని సాధించింది. నిత్యామీనన్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుతో మంచి సక్సెస్ను సాధించింది.
కుర్ర భామలు తమ సత్తాను చాటుకున్నారు. రెజీనా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం సినిమాలతో తన హవాను చాటుకుంది. అవికా గోర్ సినిమా చూపిస్త మావ, తను నేను సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇక మరో యంగ్ బ్యూటీ రాశీఖన్నా జిల్, బెంగాల్ టైగర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. లక్ష్మీ మంచు కూడా దొంగాట, బుడుగు సినిమాలతో అలరించగా.. ఇక భలే భలే మగాడివోయ్ చిత్రం లావణ్య త్రిపాఠి రేంజ్ని ఒక్కసారిగా పెంచేసింది. ఛార్మి జ్యోతిలక్ష్మీ చిత్రంతో పర్వాలేదనిపించింది. నందితకు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని చిత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది.అల్లరి పిల్ల స్వాతి త్రిపుర సినిమాతో మంచి పేరే తెచ్చుకుంది . ఇక కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తన అందాలతో అలరించగా, దిశా పటాని లోఫర్ చిత్రంతో యూత్కు పిచ్చెక్కించింది.