సమీరా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం అయితంపూడి. ఆమె తండ్రి ఇక్కడే పుట్టారు. అయితే తండ్రి ఉద్యోగ రీత్యా ముంబైలో సెటిల్ అయిన ఆమె అక్కడ మోడలింగ్ కెరీర్లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి హాట్ ఐటెం గర్ల్గా, హాట్ బాంబ్గా మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఆమె తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. మెగాస్టార్ చిరు సరసన జై చిరంజీవా సినిమాలో నటించిన ఆమె జూనియర్ ఎన్టీఆర్తో రెండు సినిమాల్లో నటించింది. నరసింహుడు సినిమాతో పాటు అశోక్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా నటించింది.
ఈ సినిమాల షూటింగ్ టైంలోనే ఎన్టీఆర్కు సమీరా రెడ్డికి అఫైర్లు ఉన్నాయన్న వార్తలు అయితే ప్రత్యేకంగా వినిపించేవి. ఎన్టీఆర్ ఆమెను చాలా స్పెషల్గా చూస్తున్నాడని.. ఆమె విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నాడన్న పుకార్లు అయితే వినిపించేవి. ఎన్టీఆర్ ఆమెకు ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చాయన్న పుకార్లు 2005-06 టైంలో వినిపించేవి. ఇక అప్పట్లో ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్... అటు చంద్రబాబు సైతం ఎన్టీఆర్ ను ఎలా వాడుకోవాలన్న ప్లాన్తో ఉండేది. ఇక సమీరా రెడ్డికి ఇటు సినిమా వ్యక్తుల నుంచి.. అటు రాజకీయంగాను బెదిరింపులు తప్పలేదట.
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు ఫోన్లు చేయడం.. బెదిరించడం.. నువ్వు తెలుగు సినిమాలు చేయవద్దు... ఇక్కడకు ఎందుకు వస్తున్నావంటూ బెదిరించే వారన్న వార్తలు కూడా అప్పట్లో వినిపించేవి. ఆ తర్వాత సమీరా రెడ్డి తెలుగు సినిమాలు చేయలేదు. తెలుగులో కొన్ని మంచి సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా వాటిని ఈ కారణంతోనే ఆమె వదులుకుందని అనేవారు. ఇక బాలీవుడ్ పైనే పూర్తిగా కాన్ సంట్రేషన్ చేసిన ఆమె పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయ్యి అక్కడే సెటిల్ అయిపోయింది.