యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యాం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకుండానే వరుస సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ లో ఆదిపురుష్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసిన ప్రభాస్ ఆ సినిమాతో పాటుగా నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్ లో ఉంచాడు. ఇక లేటెస్ట్ గా సలార్ అంటూ కె.జి.ఎఫ్ డైరక్టర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

సలార్ సినిమా ఎనౌన్స్ మెంట్ తో సౌత్ స్టార్స్ కే కాదు బాలీవుడ్ స్టార్స్ కు షాక్ ఇచ్చాడు ప్రభాస్. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు యంగ్ రెబల్ స్టార్. అయితే రాధే శ్యాం పూర్తి కాగానే ఆదిపురుష్ కు ఈక్వల్ గా ఆ సలార్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రశనత్ నీల్ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను 2021 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

ఇక ఆ సినిమా అలా రిలీజ్ కాగానే సలార్ సెట్స్ మీదకు వెళ్తుందట. కె.జి.ఎఫ్ రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ప్రభాస్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్స్ తో అదరగొడతాడని తెలుస్తుంది. తప్పకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

సలార్ తో సత్తా చాటాలని చూస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ తో ఈక్వల్ గా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. తప్పకుండా బాహుబలి కాదు అంతకుమించి సినిమాలు ప్రభాస్ రానున్న ప్రాజెక్టులు కానున్నాయని చెప్పొచ్చు.                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: