రాజమౌళి దృష్టి ప్రస్తుతం తాను తీస్తున్న ‘బాహుబలి’ రెండుభాగాల పై ఉన్నా ఈ రెండు విడుదలైన తరువాత వచ్చే సంవత్సరం తాను ఏమి సినిమా చేయాలి అన్న ఆలోచన ఇప్పటి నుంచే చేస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి దృష్టి ఒక జేమ్స్ బాండ్ తరహా సినిమా పై ఉంది అని టాక్.

ఈ విషయాలను పసిగట్టిన అల్లుఅరవింద్ తన గీత ఆర్ట్స్ బ్యానర్ పై తన కుమారుడు అల్లుఅర్జున్ ను హీరోగా పెట్టి అటువంటి జేమ్స్ బాండ్ సినిమాను తీయమని అడుగుతున్నాడని టాక్. అయితే రాజమౌళి దృష్టి పైకి చెప్పక పోయినా టాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సినిమాలకు చిరునామాగా నిలిచినా సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ తో ఇటువంటి ప్రయోగం చేస్తే ఎలాఉంటుంది అన్న ఆలోచన కూడా ఉంది అని అంటున్నారు.

అయితే ఎప్పటి నుంచో అల్లుఅరవింద్ తన కుమారుడితో ఒక సినిమా చేయమని కోరుతూ ఉండటంతో రాజమౌళి ఈ జేమ్స్ బాండ్ తరహా సినిమాను బన్నీ తో చేసే అవకాశమే ఎక్కువగా ఉంది అని టాక్. అయితే ‘బాహుబలి’ రెండు భాగాలు విడుదలై వాటి ఫలితాలు పూర్తిగా వచ్చిన తరువాత మాత్రమే వచ్చే సంవత్సరం మధ్యలో రాజమౌళి నిర్ణయం ఉంటుంది అని అంటున్నారు.

ఈలోగా అల్లుఅర్జున్ ఒప్పుకున్న సినిమాలు అదేవిధంగా మహేష్ నటిస్తున్న సినిమాలు పూర్తి అయి విడుదల అవుతాయి కాబట్టి ఆ తరువాత ఈక్వేషన్స్ బట్టి రాజమౌళి నిర్ణయం ఉంటుంది అనే మాటలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: