టాలీవుడ్ లో ఉన్న ఊర మాస్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. ఆయన కెరియర్ మొదటి నుండి కూడా మాస్ సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ డైరెక్టర్ తో సినిమాలు తీసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన " వినయ విధేయ రామ " సినిమా ఫ్లాప్ గా నిలవడంతో పాటు ఈ మాస్ దర్శకుడిని అనేక విమర్శలకు గురి చేసింది. దాంతో తిరిగి మునుపటి సత్తా చాటెందుకు ప్రస్తుతం బాలయ్య తో మూవీ చేస్తున్నాడు. " అఖండ " అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఉగాది కానుకగా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

 వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా తరువాత బోయపాటి దర్శకత్వం వహించే మూవీ పై ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాస్ మహారాజ్ తో బోయపాటి కాంబినేషన్ రిపీట్ కానుందని టాక్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన " భద్ర " సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా ఈ సినిమా తోనే బోయపాటి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇక రవితేజ, బోయపాటి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ గతంలో కూడా వార్తలు వచ్చాయి.

అయితే అప్పడు కార్య రూపం దాల్చలేదు. కానీ ప్రస్తుతం సమాచారం మేరకు బోయపాటి తరువాతి సినిమా రవితేజ తోనేనట. ప్రస్తుతం రవితేజ " ఖిలాడి " సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే 28న విడుదల కానుంది. ఈ సినిమా తరువాత మరో కొత్త దర్శకుడితో సినిమా చెయ్యనున్నాడు. అలాగే "నేను లోకల్ " ఫేమ్ త్రినాథ్ రావు నక్కిన కూడా లైన్లో ఉన్నాడు. మరి మాస్ రాజ్ ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన తరువాత బోయపాటి సినిమా చేస్తాడా లేక వీటికంటే ముందే పట్టలేక్కిస్తాడా అనేది చూడాలి. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ కాంబినేషన్ కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: