ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దాని తర్వాత ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సలార్. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా కేజీఎఫ్ లాంటి భారీ చిత్రం తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ రేంజ్ కి తగ్గట్లుగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడట. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో హీరోయిన్ సమంత కూడా నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇప్పటికి అయితే ఈ సినిమా గురించిన ఈ వార్త అధికారిక ప్రకటన అయితే చేసుకోలేదు కానీ ఇది నిజం అని అంటున్నారు. ఇక పోతే ఈ సినిమాలో మరో కథానాయికగా బాలీవుడ్ హీరోయిన్ వాణీకపూర్ ను కూడా ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో పొడుగుకాళ్ల సుందరి గా అందాల రచ్చ చేస్తూ కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న వాణికపూర్ ఈ సినిమాకు హైలెట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతోనే ఈమెను ఈ సినిమాలో ఎంపిక చేశారు అని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే ప్రభాస్ బాలీవుడ్ లో ఆది పురుష్  సినిమా తో డెబ్యూ చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా గా వస్తుండగా భారీ బడ్జెట్ తో భారీ రేంజ్ లో తెరకెక్కుతుంది.  ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రామాయణం ఆధారంగా 3డిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఓం రౌత్. ఇక పాన్ వరల్డ్ సినిమా గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు .ఇందులో దీపికా పడకునే హీరోయిన్గా నటిస్తుండగా అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోల లో మొదటి స్థానంలో ఉంటూ తనకు ఎదురు లేదని చెబుతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: